Rashtrapati Bhavan has filed a complaint with Delhi Police against former IPL commissioner Lalit Modi

Rashtrapati bhavan files complaint against lalit modi over tweets defaming pranab

lalit modi, pranab mukherjee, president of india, rashtrapati bhavan, omita paul, defamatory tweets, lalit modi tweets, twitter controversy, lalit modi controversy, india president, pranab mukherjee latest updates

Rashtrapati Bhavan files complaint against Lalit Modi over tweets defaming Pranab : Rashtrapati Bhavan has filed a complaint with Delhi Police against former IPL commissioner Lalit Modi for posting “defamatory” tweets against President Pranab Mukherjee and his secretary Omita Paul.

మరో వివాదంలో మోదీ.. ట్విటర్ లో ‘రాష్ట్రపతి’పై సంచలనం!

Posted: 07/06/2015 11:40 AM IST
Rashtrapati bhavan files complaint against lalit modi over tweets defaming pranab

ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ మరో వివాదంలో చిక్కకున్నారు. క్రికెట్ రంగానికి సరికొత్త రూపురేఖలు గీసిన ఈయన ‘మనీ స్కామ్’ ఉచ్చులో బిగుసుకుపోయిన విషయం తెలిసిందే! ఈయన కుంభకోణం బయటపడినప్పటి నుంచి ఒక్కొక్క సంచలనం ఒక్కోసారి తెరమీదికొస్తోంది. ఈయనకు మద్దతు పలికిన మంత్రులుసైతం తమ పదువులు కోల్పోవాల్సి వస్తోంది. ఆ విషయాలు కాస్త పక్కనపెడితే.. మోదీ ట్విటర్ వేదికగా అప్పుడప్పుడు సంచలన ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఆమధ్య చెన్నై జట్టులో కీలక ఆటగాళ్లు ఫిక్సింగ్ కి పాల్పడ్డారని ట్వీట్ చేసి దుమారం రేపిన ఈయన.. తాజాగా రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.

రాష్ట్రపతి, ఆయన కార్యదర్శి ఒమితా పౌల్, వివేక్ నాగ్ పాల్ అనే వ్యాపారవేత్త ఫోటోను మోదీ ట్విటర్ లో పెట్టారు. ఇలా వారి ఫోటోలు పెడుతూ.. నాగ్ పాల్ రాష్ట్రపతి ఆర్థికమంత్రిగా వున్నప్పుడు తన నుంచి లబ్దిపొందారని లలిత్ ఆరోపించారు. అంతేకాదు.. గతంలో ప్రణబ్ ఆర్థికమంత్రిగా వున్నప్పుడు కొచ్చి ఫ్రాంచైజీలో వాదాటాదారుల పెట్టుబడుల గురించి ప్రశ్నించినందుకు ఆయన తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఆదేశించారని అప్పట్లో ఆయన చేసిన ఆరోపణ తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం వల్ల ఆ సమయంలో కేంద్రమంత్రి శశిథరూర్ తన పదవినుంచి నుంచి తప్పుకోవడం కూడా తెలిసిందే! అలా అప్పుడు సంచలన వివాదానికి తెరలేపిన మోదీ.. ఇప్పుడు ఆ తరహాలో మరోసారి రాష్ట్రపతిపై ట్విటర్ లో ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

లలిత్ మోదీ ఈ విధంగా ట్వీట్లు చేయడంపై రాష్ట్రపతి భవన్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిష్టను దెబ్బతీసేలా మోదీ ట్వీట్ చేశాడని.. జూన్ 23, 25న ట్విటర్ లో పోస్ట్ అయిన చిత్రాలను, ఇతర వివరాలను ఫిర్యాదు కాపీతో ఢిల్లీ పోలీసు కమిషనర్ కు పంపింది. కాగా.. ఈ ఫిర్యాదును పోలీసు కమిషనర్ తదుపరి చర్యలకోసం ఆర్థికనేరాల విభాగానికి పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఐపీసీ కింద కేసు నమోదు చేయాలా లేక ట్విటర్ లో ఆ పేజీని బ్లాక్ చేయించడానికి స్థానిక కోర్టును ఆశ్రయించాలా అన్న దానిపై చర్చలు కొనసాగిస్తున్నారని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalit modi  pranab mukherjee  rashtrapati bhavan  twitter  

Other Articles