న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు రోజుల వన్డే సిరీస్ లో తొలి వన్డే గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా మహిళల జట్టు రెండు వన్డేలో రాణించి సీరీస్ పై అధిపత్యాన్ని కోనసాగిస్తుందనుకున్న అభిమానుల ఆశలు వమ్మయ్యాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళల జట్టు మూడు విక్కెట్ల నష్టంతో ఓటమిని చవిచూసింది. ధీటైన న్యూజీలాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు రోజుల వన్డే సిరీస్ లో ఇరు జట్లు ఒక్కో గెలుపుతో సీరీస్ ను సమం చేశాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మహిళల టీమ్ స్కోరు బోర్డును పరుగులెత్తించేందుకు అష్టకష్టాలు పడింది. నిర్ణీత యాభై ఓవర్లలో మరో మూడు బంతులు మిగిలి వుండగానే భారత మహిళల జట్టు అటౌట్ అయ్యింది. కెప్టెన్ మిథాలి రాజ్ సహా జట్టులో ఇద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. కాగా, టీమిండియా జట్టులో తిరుష్ కామినీ 61 పరుగులు సాధించగా, హర్మాన్ ప్రీత్ కౌర్ 31 సాధించింది. న్యూజీలాండ్ బౌలర్లలో సుజీ బేట్స్ 21 పరుగులకు 3 వికెట్లు సాధించారు.
ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ను బారత స్పినర్లు నిలదోక్కకోనివ్వలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ వుమెన్లను వెనువెంటనే పెవీలియన్ కు పంపించినా.. చివరిలో వచ్చిన సోఫి వివైన్ న్యూజీలాండ్ కు విజయాన్ని అందించి పెట్టారు. అమెతో పాటు కెటీ పెర్కిన్స్ విరోచితంగా ఆడి 30 పరుగులు సాధించారు. భారత బౌలర్లలోజులన్ గోస్వామి 14 పరుగులిచ్చి రెండు రెండు విక్కెట్లు పడగొట్టింది. సిరీస్ సమం కావడంతో.. మరో మూడు మ్యాచ్ లపై ఇరు జట్టు నువ్వా నేనా అన్న రీతితో పోరుకు తలపడనున్నాయ
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more