టీమిండియా జట్టు ఆటగాడైన అజింక్యా రహానేకి అదృష్టం బాగానే కలిసొచ్చినట్లుంది. అతగాడు ఊహించని ఉన్నత పదవిని అనుకోకుండా అతనిని వరించింది. కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ లేకుండా ఆడబోతున్న ఇండియా క్రికెట్ జట్టుకు అతగాడు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
గతకొన్నాళ్ల నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనపై నెలకొన్న ఉత్కంఠపై స్పష్టత వచ్చేసింది. గతంలో కొన్ని అనివార్య కారణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో టీమిండియా జింబాబ్వే టూర్ ని రద్దు చేయాలని బీసీసీఐ భావించింది. కానీ.. ఇప్పుడు అన్ని సర్దుకోవడంతో ఈ టూర్ ని ఓకే చేసేసింది. ముందు అనుకున్నట్లుగానే వచ్చేనెల 10న ఈ పర్యటన యధావిధిగా ఆరంభమవుతుందని బీసీసీఐ పేర్కొంది. ఇక ఈ టూర్ కు సందీప్ పాటిల్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. వీరిలో కొందరు ఆటగాళ్లను విశ్రాంతి ఇవ్వగా.. మరికొందరు యువఆటగాళ్లకు అవకాశం కల్పించారు.
ఈ జింబాబ్వే టూర్ కు ధోనీ, కోహ్లీ సహా రోహిత్ శర్మ, అశ్విన్, సురేష్ రైనాలకు విశ్రాంతి ఇచ్చినట్లుగా సెలక్టర్లు పేర్కొన్నారు. వారందరూ ఏడునెలలకుపైగా అన్ని ఫార్మాట్ లలోనూ తీరిక లేకుండా మ్యాచులు ఆడినందుకు.. ఇప్పుడు వారికి విశ్రాంతి ఇచ్చారు. నిజానికి జింబాబ్వే టూర్ లో రోహిత్ లేదా రైనాను కెప్టెన్ గా నియామకం చేసి పంపుతారని భావించారు కానీ.. వారిద్దరిని విశ్రాంతి ఇచ్చేసి రెహానేను నియమించారు. ఇక, వన్డే జట్టుకు సంబంధించి అశ్విన్ స్థానంలో హర్భజన్ కు చోటు దక్కింది. ఈ టూర్ లో జింబాబ్వేతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.
జింబాబ్వే టూర్ కు వెళుతున్న టీమిండియా జట్టులో.. అజింక్యా రెహానే (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, మురళీ విజయ్, అంబటి రాయుడు, మనీష్ తివారి, ఉమేశ్ యాదవ్, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, దవళ్, కేదార్, సందీప్, అక్షర్, కరణ్ శర్మ, భువనేశ్వర్ లు వున్నారు. ఇందులో వున్న యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం లభించదని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more