వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ అప్పుడప్పుడు కాస్త విచిత్రంగా వ్యవహరిస్తుంటాడు. మ్యాచ్ గెలిచినప్పుడు తన ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తపరిచే ఈ క్రికెటర్.. ఓడిపోయినప్పుడు మరో విధంగా ప్రవర్తిస్తుంటాడు. అంతేకాదు.. తనకు కోపమొచ్చినప్పుడల్లా ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకోవడం ఇతనికి అలవాటు! కానీ.. ఇలా ప్రతిసారీ నోరుపారేసుకుంటే ఎవరుమాత్రం ఊరికేవుంటారు చెప్పండి! అందుకే.. తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని అంపైర్లు సూచించగా.. మనోడు దానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన చేపట్టాడు. అదే ఇప్పుడు క్రికెట్ జగత్తులో హాట్ టాపిక్ గా మారింది.
ఐపీఎల్ 8లో భాగంగా ఆదివారం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్కు మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 209 పరుగులు చేయగా.. 210 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగుళూరు ఆటగాళ్లు క్రీజులోకి వచ్చారు. ఈ క్రమంలోనే ముంబై బౌలర్ లసిత్ మలింగ ఓపెనర్ మూడో ఓవర్ ను వేయగా.. క్రిస్ గేల్ మెయిడెన్గా ఆడాడు. అంతే! పొలార్డ్ తన దేశానికి చెందిన క్రిస్ గేల్ దగ్గరికి వెళ్లి పొలార్డ్ నోరు పారేసుకున్నాడు. ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. అయితే.. వీరిద్దరిలో పొలార్డ్ దే తప్పు వుందని భావించిన ఆన్ఫీల్డ్ అంపైర్లు.. పొలార్డ్ను కామ్గా ఉండమని చెప్పారు. దీంతో కోపానికి గురైన కీరన్ పొలార్డ్.. డగౌట్కు వెళ్లి నోటికి ప్లాస్టర్ వేసుకొని వచ్చాడు. అప్పటినుంచి ఇది సంచలన వార్తగా మారింది.
ఇదిలావుండగా.. పొలార్డ్ చేపట్టిన ఈ వినూత్న నిరసనను హర్భజన్ సింగ్ సమర్ధించాడు. ‘అతనిని అంపైర్ కామ్గా ఉండమని చెప్పాడు. ఆ క్రమంలోనే అతను నోటికి ప్లాస్టర్ వేసుకున్నాడు. ఇందులో తప్పేముంది. అలా చేయడం అతనికిష్టం అనిపించింది.. చేశాడు.. అంతే!’ అని హర్భజన్ స్పష్టం చేశాడు. ‘హై ఓల్టేజ్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్లో ఏదోక ప్రత్యేకతతో పొలార్డ్ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. వెస్టిండీస్ ఆటగాళ్లు భిన్నంగా కనిపిస్తూ ఉండటం నిజంగా మంచి అలవాటు’ అంటూ భజ్జీ అభివర్ణించాడు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more