ఐసీసీ ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. ఆదివారం మెల్ బోర్న్ లో దాయాది దేశం న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లలో జగజ్జేత్త ఎవరనేది తేలిపోనుంది. కాగా ఆదే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను వన్డేల నుంచి రిటైర్ అవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రకటించారు. ఫైనల్ కు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం భారత్ తో మ్యాచ్ గెలుపోందిన రోజునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. రేపటి మ్యాచ్ తో తాను మొత్తం 245 వన్డే మ్యాచ్ లలో పాల్గోన్నట్లు అవుతుందన్నారు.
తన బ్యాటింగ్తో ఎన్నో సందర్భాల్లో ఆసిస్ని విజయతీరాలకు చేర్చిన క్లార్క్ తన నిర్ణయాన్ని తన సహచర క్రీడాకారులకు కూడా చెప్పానన్నారు. వారితో పాటు అస్ట్రేలియా క్రికెట్ బోర్డు సభ్యులు రాడ్ మార్ష్, జేమ్స్ సూధర్ లాండ్, డారెన్ లహ్మాన్ లతో కూడా మాట్లాడి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అనూహ్యంగా తాను ఈ ప్రకటన చేయడంతో జట్టు సభ్యులు కూడా కొంత నిరాశకు గురయ్యారని చెప్పారు. 21 ఏళ్ల వయసులోనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్థానం పొంది గత 12 ఏళ్లగా తమ దేశానికి క్రీడారంగంలో ముఖ్యంగా క్రీకెట్ లో అవకాశం లభించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ క్రమంలోనే తనకు నాలుగేళ్ల కిందట కెప్టన్ గా అవకాశం లభించిందని చెప్పారు. తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇది సరైన సమయం అని భావిస్తున్నానట్లు చెప్పుకోచ్చాడు. 2019లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్ వరకు తాను ఫిట్ గా వుండగలనని, క్రికెట్ ఆగడలనని భావించడం లేదని, అందుచేతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. క్లార్క్ 244 వన్డే మ్యాచ్లు ఆడి 7,907 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 130 పరుగులు నమోదు చేసిన క్లార్క్ 8 శతకాలు, 57 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే టెస్ట్ మ్యాచ్లలో కొనసాగనున్నట్లు చెప్పారు. టెస్టుల్లో 108 మ్యాచ్లు ఆడి 8,432 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధికంగా 329 పరుగులు చేశాడు. కాగా అసీస్ కెప్టెన్ గా 73 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించిన క్లార్క్ అందులో 49 మ్యాచ్ లను గెలపించాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more