ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో అతిధ్య జట్టు ఆస్ట్రేలియాతో 95 పరుగుల ఓటమిని చవిచూసిన అనంతరం.. భారత జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని ఓటమి బాధను ఎక్కడ కనిపించకుండా చిరుమందహాసంతో మీడియా ముందుకు వచ్చిన తీరుపై నెట్ జనులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఢిపెండింగ్ ఛాంపియన్స్ అన్న ఒక్క ధీమా తప్ప.. అంచనాలకు దూరంగా వున్న భారత జట్టు సెమీస్ వరకు వెళ్లి వెనుదిరగడంపై నెట్ జనులు ప్రశంసిస్తున్నారు. లీగ్ దశలో తొలి మ్యాచ్ నుంచి భారత్ జైత్రయాత్ర కోనసాగించిందని.. అయితే గెలిచినప్పడు జట్టుకు వెన్నుదన్నుగా వుండటం కంటే.. ఓటమిలోనే ఓదార్పునివ్వాలని నెట్ జనులు ట్విట్టర్ లో వారి పోస్టింగుల ద్వార మద్దతు తెలుపుతున్నారు.
పాకిస్థాన్, సౌత్ ఆప్రికా, వెస్టీండీస్ లను చిత్తు చేసినప్పడు వచ్చిన ప్రశంసలు అస్ట్రేలియాతో వారి సొంత దేశంలో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవిచూడగానే ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికోందరు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాజీనామా చేయడం లేదని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోనిని మిస్టర్ కూల్ గా అభివర్ణిస్తున్న నెట్ జనులు.. ఓటమితో ఆయన కళ్లు ఎర్రబడ్డాయని అయినా ఎలా సంతోషంగా మీడియాతో మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more