ప్రపంచ కప్ లో ఇవాళ సిడ్నీ వేదికగా అతిథ్య జట్టు అస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒత్తడి వల్లే ఓటమిపాలయ్యామని ఢిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి అన్నారు. 95 పరుగులతో అసీస్ చేతిలో ఓటమి పాలైన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసీస్ తో జరిగిన ఉత్కంఠకర పోరులో తాము ఒత్తిడిని అధిగమించలేకపో్యామని అంగీకరించాడు. ధీటైన బ్యాట్స్ మెన్లు వున్నప్పటికీ.. ఈ మ్యాచ్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని స్పష్టం చేశాడు.
ఛేజింగ్లో భారత ఓపెనర్లు శుభారంభం అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడంతో మిగతా బ్యాట్స్ మెన్లపై ప్రతికూల ప్రభావం చూపిందని ధోనీ చెప్పాడు. తాను కూడా పూర్తి స్థాయిలో రాణించలేకపోయానని అన్నాడు. భారత్ కు చేరుకోగానే రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? అన్న ప్రశ్నకు స్పందించిన ధోని.. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్లో ఆడుతానని చెప్పాడు. ఫిజికల్ ఫిట్ నెస్ సరిగ్గా వుంటే ఆ తర్వాత మరో పర్యాయం రానున్న 2019 ప్రపంచ కప్లో ఆడాతానన్నారు. అయితే ఈ విషయమై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని చెప్పాడు. లీగ్ దశ నుంచి సెమీస్ వరకు భారత జట్టుకు అండగా నిలిచి.. మ్యాచ్ ఆధ్యంతం తమకు మద్దతు పలికిన క్రీడాభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more