India beat west indies by 4 wickets

india versus west indies, indies vs west indies, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, india CWC 2015, Live Scores, Live Updates, west indies, west indies CWC 2015, Sports, World Cup Live

captain dhoni innings helped india win against West Indies by 4 wickets

విండీస్ పై 4 వికెట్ల తేడాతో ధోనీసేన విజయం

Posted: 03/06/2015 07:50 PM IST
India beat west indies by 4 wickets

ప్రపంచ కప్ టోర్నమెంటులో గ్రూప్ భిలో వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్ లో  టీమిండియా నాలుగు విక్కెట్లతో విజయాన్ని నమోదు చేసుకుంది. విండీస్ విసిరిన 183 పరుగల లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా ఆటగాళ్లు తడబాటుకు గురైనా ఎట్టకేలకు చానాళ్ల తరువాత ఫామ్ లోకి వచ్చిన కెప్టెన్ దోణి ఆచితూచి ఆడుతూ విండీస్ పై విజయాన్ని నమోదు చేశాడు.. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ ఓపనెర్లు విలవిలలాడారు. 20 పరుగుల వద్ద రెండు విక్కట్లు జారవిడుచుకున్నారు. విండీస్ తో పెర్త్ లో జరుగిన మ్యాచ్ లో ధోణి సేన 11 పరుగులకే తొలి విక్కెట్ ను కోల్పోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 9 పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.  ఆ తరువాత రోహిత్ శర్మ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఓపెనర్లు ఇద్దరూ 20 పరుగలకే పెవీలియన్ దారి పట్టారు.

ఆ తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ.. అజ్యింక రహానేలు కొద్ది సేపు నిలకడగా ఆడి భారత్ స్కోరును 60 పరుగుల వద్దకు చేర్చారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో షాట్ బాల్ ను పుల్ చేసి కొట్టడంలో విఫలం చెందిన కోహ్లీ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వెనువెంటనే అజ్యింక రహానే కూడా ఔటయ్యాడు. ఆ తరువాత వచ్చిన సురేష్ రైనా కూడా పెవీలియన్ దారి పట్టాడు. ఆ తరువాత వచ్చిన జెడేజా కొద్ది సేపు ఆచితూచి ఆడినా.. ఆ తరువాత హుక్ షాట్ కొట్టేందుకు యత్నించి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ 30 ఓవర్లలో 135 పరుగులు సాధించడానికి శ్రమించింది. క్రీజ్ లో వున్న సారధి మహేంద్ర సింగ్ ధోని.. అశ్విన్ నిదానంగా రాణించారు. విక్కెట్ ను జారవిడుచుకోకుండా అచితూచి ఆడారు. 64 బాల్ లలో 51 పరుగుల భాగస్వామ్యంతో భారత్ కు మరో విజయాన్ని అందించారు. కేవలం 39.1 ఓవర్లలోనే భారత్ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ధోణి 45 పరుగులను సాధించగా, అశ్విన్ 16 పరుగులు సాధించాడు. భారత్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ 33 పరుగులు, సురేష్ రైనా 22 పరుగులు సాధించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్.. టీమిండియా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు క్రమంగా పెవీలియన్ చేరుతుండటంతో విండీస్ కేవలం 182 పరుగలకే అలౌట్ అయ్యింది. నిర్ణీత 50 ఓవర్లలో 44.2 ఓవర్లలోనే చాపటుట్టేసింది. భారత్ కు 183 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్టెన్ హోల్డర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 64 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. గేల్ 21, కార్టర్ 21, సామీ 26, టేలర్ 11 పరుగులు చేశారు. రామదిన్ డకౌటయ్యాడు. స్మిత్(6), శ్యామ్యూల్స్(2), సిమ్సన్(9), రసెల్(8) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3, ఉమేష్ యాదవ్ 2, జడేజా 2 వికెట్లు తీశారు. అశ్విన్, మొహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  west indies  

Other Articles