ప్రపంచ కప్ క్రికెట్ టార్నమెంటులో పేలవమైన ప్రదర్శనతో అటు స్వదేశంతో పాటు ఇటు ప్రపంచ వ్యాప్త అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కోంటున్న పాకిస్థాన్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వన్డే ప్రపంచకప్ పూల్ - బి లో భాగంగా పాకిస్థాన్-జింబాబ్వేల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో రాణించిన పాక్ బౌలర్లు ఎట్టకేలకు జింబాబ్వేను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. చివరకు విజయం పాకిస్థాన్నే వరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 20 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. ప్రత్యర్థి జింబాబ్వే ముందు 236 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మిస్బా(73), వహాబ్ రియాజ్ (54)తో రాణించారు. వారి ఇద్దరికి తోడు ఉమర్ అక్మల్ 33 పరుగులు చేయడంతో పాక్ నిర్ణీత ఓవరల్లో 7 వికెట్లకు 235 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో చటారా మూడు, విలియమ్స్ రెండు వికెట్లు తీశారు. పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆది నుంచే తటపటాయించింది. పాక్ పేసర్ ఇర్ఫాన్ జింబాబ్వే ఓపెనర్లతో పాటు మరో ఇద్దిరని అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడు మరో బౌలర్ రియాజ్ నాలుగు వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశాడు. జింబాబ్వే బ్యాట్స్మెన్లో టేలర్ (50), విలియమ్స్ (33), హామిల్టన్ (29) మినహా ఎవరూ రాణించలేదు. చివరలో చిగుంబర 20 చేయటంతో జింబాబ్వే స్కోరు 200 మార్కు దాటింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more