ప్రపంచకప్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సునామీలాగా భారీగా పరుగులు చేసింది. వరల్డ్కప్-2015లో ఇంతటి భారీ స్కోర్ను ఏ జట్టు చేయలేదు. దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. విండీస్ విజయలక్ష్యం 409 పరుగులు.
ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ పరుగుల వర్షం కురిపించాడు. 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ప్రపంచకప్లో రెండో వేగవంతమైన శతకం ఇది. డివిలియర్స్ 66 బంతుల్లో 162 పరుగులు చేశారు. అందులో 17 ఫోర్లు, 8 సిక్స్లు ఉన్నాయి. కుక్ 12, ఆమ్లా 65, ప్లీసిస్ 62, రోసావ్ 61, మిల్లర్ 20, బెహ్రాడీన్ 16 పరుగులు చేశారు. హోల్డర్ 2, టేలర్ ఒక వికెట్ తీసుకున్నారు.
వరల్డ్ కప్ లొ రికార్డుల మోత మోగుతోంది. గత మ్యాచ్ లో డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించారు క్రిస్ గేల్. వరల్డ్ కప్ లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ డివిలియర్స్ నమోదు చేశారు. చివరి ఓవర్లో నాలుగు సిక్సులతో మొత్తం 30 పరుగులు తీశారు. అయితే అత్యధిక రన్స్ రికార్డును మాత్రం దాటలేదు. 413 పరుగులతో ఇండియా పేరు మీదున్న రికార్డు బద్దలవుతుందని అందరు ఆకస్తిగా చూసినా, చివరకు నిరాశే మిగిలింది. ఓవర్స్ అయిపోవడంతో సౌతాఫ్రికా రికార్డును బద్దలుకొట్టలేకపోయింది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more