వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇవాళ ఉదయం ఆయన తన రిటైర్మెంట్ కు సంబంధించిన అంశాన్ని ప్రకటించారు. గత నాలుగేళ్లుగా టెస్టు మ్యాచ్ లకు దూరంగా వున్న బ్రావో చివరి సారిగా 2010 డిసెంబర్ మాసంలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఆడాడు. అప్పటి నుంచి తాను టెస్టు మ్యాచ్ లకు దూరంగానే వున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తాను టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెబుతన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇదివరకే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సభ్యులతో చర్చించానని కూడా తెలిపాడు.
31 ఏళ్ల వయస్సున్న బ్రావో.. తన కెరీర్లో 40 టెస్టులు ఆడి, 87 విక్కెట్లు తీసుకోవడంతో పాటు.. 2200 పరుగులను కూడా సాధించాడు. టెస్టుల నుంచి వైదొలగి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగనున్నట్టు ప్రకటించాడు. తన టెస్టు కెరీర్ లో విజయంతో పాటు పలు పరాభవాలను కూడా తాను చవిచూసినట్లు చెప్పుకోచ్చాడు. గెలుపులతో వచ్చిన ఆనందాలతో పాటు మ్యాచ్ ఓటములతో టీమ్ పడిన ఆవేదనలను కూడా తాను పంచుకున్నానని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా తాను గొప్ప ఉత్సాహంతో, లోతైన అవగాహనతో ఉత్తమ క్రికెట్ ను ఆడానని చెప్పుకోచ్చారు. చివరికి తాను ఈ క్రీడా విభాగంతో తన దేశ ప్రజలకు తరపున తాను ప్రాతినిథ్యం వహిస్తున్నానన్న విషయాన్ని తెలిపాడు.
విజయాలను ఆస్వాధించిన క్రమంలో తాను పొందిన ఆనందాలు చిరస్థాయిగా గుర్తుంటామని చెప్పాడు. కాగా ప్రస్తుతం తాము ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటున్నామని, మళ్లీ ఆ రోజులు వెనక్కు రావాలంటే తాము అంతే ప్రేమగా క్రీడను ఆడాల్సివుందని తెలిపారు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో మరో ఏడాది పాటు ఒప్పందం ఉందని ఈ క్రమంలో తాను వన్డే మ్యాచ్ లతో పాటు టీ 20 మ్యాచ్ లను మాత్రమే ఆడనున్నట్లు తెలిపాడు.. కాగా పదకొండవ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జట్టుకు బ్రావోకు స్థానం లభించక పోవడమే తన ఈ నిర్ణయానికి కారణమన్న అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more