ఇటీవలే శ్రీలంకతో జరిగిన ఐదువన్డేల క్రికెట్ సిరీస్’లో భాగంగా భారత సారథిగా కొనసాగిన కోహ్లీ... తన కెప్టెన్’షిప్ ఏంటో ఆ సిరీస్’లో నిరూపించుకున్నాడు. ఒక్క మ్యాచ్ కూడా లంక చేతిలో పడనివ్వకుండా మొత్తం సిరీస్’ను కైవసం చేసుకోవడంలో విరాట్ సారథిగా నిరూపించుకున్నాడని ప్రతిఒక్కరు ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే వన్డేల్లో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్లేయర్’గా రెండవ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. దీంతో భారత సారథిగా ధోనీ తర్వాతి స్థానాన్ని కోహ్లీ సంపాదించుకోగలిగాడు. పైగా ధోనీ గాయపడటంతో అతని స్థానాన్ని కోహ్లీ భర్తీ చేస్తున్నాడు. ఈ సందర్భంగానే ఆస్త్రేలియాతో ఆడనున్న టెస్టు మ్యాచులకు భారత జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు కోహ్లీ!
ఆస్ట్రేలియా జట్టుతో ఆడనున్న క్రికెట్ సిరీస్ సందర్భంగా భారత జట్టుకు తాను కెప్టెన్’గా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా వుందని తెలిపిన విరాట్... కెప్టెన్’గా తాను విజయవంతం కావాలంటే తన సహచరుల చేతుల్లోనే వుందని.. వాళ్లు సరిగ్గా ప్రదర్శించగలిగితే నా క్రికెట్ కెరీర్ ఇంకా సులువుగా సాగుతుందని పేర్కొన్నాడు. ‘‘జట్టులోని కుర్రాళ్ల సామర్థ్యం పట్ల నేనెంతో విశ్వాసంగా వున్నాను. పరిస్థితులుకు తగ్గట్లు జట్టును నడిపించడం నా బాధ్యత. ఆటగాళ్లు నాకు మద్దతుగా నిలుస్తూ.. ఆశించిన ప్రదర్శన ఇస్తే కెప్టెన్’గా నా ప్రదర్శన కూడా బాగుంటుంది’’ అని స్పష్టం చేశాడు కోహ్లీ. మరి ఈ ఆస్ట్రేలియా టూర్’లో కోహ్లీ తన కెప్టెన్’షిప్’ని ఏమేరకు ప్రదర్శించగలడో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more