యువరాజ్ సింగ్.. ఒకప్పుడు టీమిండియా క్రికెట్ జట్టులో ఓ అద్భుత యువక్రీడాకారుడు. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా సంచలన క్రీడాకారుడిగా పేరుగాంచాడు. గతవిషయాలెందుకు.. 2011లో జరిగిన ప్రపంచకప్ లో ఇతడొక హీరో! 365 పరుగులు సాధించడంతోపాటు 15 వికెట్ల తీసిన యువి.. భారత్ ప్రపంచకప్ గెలవడడంలో అత్యంత కీలకపాత్రను పోషించాడు. అతడు ప్రదర్శించిన ఆ ప్రతిభకు ‘‘మ్యాన్ ఆప్ ది సిరీస్’’ అతనికే దక్కింది. అటువంటి ఆటగాడికి నేడు జట్టులో అసలు చోటే లేదు. దాదాపుగా 18 నెలలనుంచి భారత్ తరఫున యువీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అంతేకాదు.. మీడియాలో కూడా కనుమరుగైపోయాడు. అప్పుడప్పుడు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే యువీ.. అలాకూడా కనిపించకుపోయాడు. క్యాన్సర్ లాంటి అత్యంత భయానకరమైన వ్యాధి నుంచి బయటపడి ఫిట్ నెస్ ను సాధించిన యువీ... జట్టులో మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే తాను ఇక జట్టులోకి రాలేనేమోనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏడాదిన్నర నుంచి ఇండియా జట్టులో తనకు స్థానం దక్కకపోవడంతో తీవ్రనిరాశకు గురైన యువీ తన ఆవేదనను అందరితో పంచుకున్నాడు. ఈ సందర్భంగానే అతను మాట్లాడుతూ.. ‘‘ఇకనుంచి ఇండియా తరఫున బరిలోకి దిగే అవకాశం రాకపోవచ్చు. ఈ విషయపై నేను ఎప్పులో ఆలోచించాను. కానీ పునరాగమనం చేయగలనన్న నమ్మకమున్నంతవరకు క్రికెట్ ఆడుతూనే వుంాను. జట్టులో చోటు సాధించడంకోసం అహర్నిశలు కష్టపడతాను. గత రెండేళ్ల నుంచి నా ఫామ్ అంత గొప్పగా లేకపోవడంతో వచ్చే ఏడాదిలో జరిగే ప్రపంచకప్ కు ఎంపికవుతానో లేదో తెలియదు. ఒకవేళ ఎంపికైతే అద్భుతమే! జట్టులో చోటుకోసం ప్రయత్నించడం తప్ప నా చేతుల్లో ఏమీలేదు. అయితే సెలెక్టర్లను మెప్పించేందకు ఏ అవకాశాన్ని వదులుకోను. కానీ వన్డే ప్రపంచకప్ కు ఎంపిక కాకపోతే జీర్ణించుకోవడం చాలా కష్టమే అవుతుంది’’.
‘‘కొన్నికొన్నిసార్లు లక్ష్యాలను ఛేదించడంలో విఫలమయ్యానుగానీ చాలాసార్లు సాధించాను. కానీ క్యాన్సర్ లాంటి అనుభవం తర్వాత లక్ష్యాలు పెట్టుకోవడం చాలా కష్టం. ఐతే మళ్లీ జట్టులోకి రావడమే నా ప్రస్తుత లక్ష్యం! ఇన్నాళ్లు జట్టులో స్థానం లభించకపోవడంతో బహుశా నేను నా చివరి మ్యాచ్ ఆడేశానేమోనని అనిపించింది’’ అంటూ యువీ తెలిపాడు. ప్రపంచకప్ గెలిచిన తర్వాత యువరాజ్ అనుకోకుండా ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ కి గురయ్యాడు. అయితే అటువంటిది వ్యాధిని సైతం పోరాడి తిరిగి ఇండియాలో రంగప్రవేశం చేశాడు కానీ.. తన చోటును నిలబెట్టుకోలేకపోయాడు. ఆ క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమయింది కానీ.. వాటి లక్షణాలు ఇంకా యువీని వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అందుకే తన అనుభవాన్ని తిరిగి సాధించడంలో చాలానే కష్టపడుతున్నాడు యువీ. ఇతను తన ప్రతిభను చాటుకోవాలంటే రాబోయే ఐపీఎల్ మ్యాచులే చివరి అవకాశం. అందులో బాగా ప్రదర్శిస్తేగానీ యువీకి 2015 ప్రపంచకప్ లో స్థానం లభించే అవకాశాలు దాదాపు లేవని అనుమానిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more