సినిమా తారల్లాగే క్రీడా రంగంలో ప్రేమ పెళ్ళి అనగానే గుర్తుకు వచ్చేది సానియా మిర్జా-షోయబ్ మాలిక్. ఇండియన్ టెన్నిస్ స్టార్ పాకిస్థానీ ఫేమస్ క్రికెటర్ ను ప్రేమించి పెళ్ళాడింది. ఇది అప్పట్లో ఒక సంచలనం. సానియా మరొక వ్యక్తిని ప్రేమించి ఉంటే ఇంత సంచలనం అయ్యేది కాదు.., కాని ఆమె ప్రేమించింది పాకిస్థాని దేశ వ్యక్తిని. వీరిద్దరి వ్యవహారం రెండు దేశాల దృష్టితో పాటు ప్రపంచ దేశాలు చర్చించుకునేలా చేసింది. అయితే ఇప్పుడు ఇద్దరికీ విరహమే మిగిలింది. జీవితం వారితో క్రికెట్-టెన్నిస్ కలిపి ఆడేసుకుంటోంది. ఈ విషయం స్వయంగా షోయబ్ మాలిక్ చెప్పాడు. తాను ఇక్కడకు వస్తే.. సానియా మాత్రం దేశంలోనే లేకుండా వెళ్ళిపోయిందని విరహ బాధను దిగమింగుకుని మరీ వివరించాడు.
కొన్నాళ్ళుగా సానియా మిర్జా ఇండియాలోనే ఉంటూ యూఎస్ ఓపెన్ కోసం ప్రాక్టిస్ చేసింది. అంతర్జాతీయ క్రీడల్లో గోల్డ్ మెడల్ కూడా కొట్టేసి.., కోటి రూపాయలు అందుకుంది. అటు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఐసీఎల్ మ్యాచ్ ల కోసం షోయబ్ హైదరాబాద్ కు వచ్చాడు. అయితే ఈ లోపే మీర్జా జపాన్ కు వెళ్ళింది. అక్కడ మ్యాచ్ లతో బిజీగా ఉండిపోయింది. అత్తవారింటికి వస్తే భార్య లేకపోవటం చూసి, షోయబ్ బాధపడ్డాడు. నగరంలో మీడియాతో మాట్లాడిన మాలిక్.., తమకు ఐదు సంవత్సరాల క్రితం పెళ్ళయిందనీ, ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయామని చెప్పాడు.
ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా.., నా భార్య ఎక్కడో జపాన్ లో టెన్నిస్ స్టేడియంలో ఉంది. ఇలా ఆటల వల్ల ఇద్దరం వ్యక్తిగత జీవితాల్లో ఎక్కువ కలిసి ఉండలేకపోతున్నట్లు చెప్పాడు. అయితే ఈ కారణం వారిద్దరి మద్య దూరాలను పెంచుతుందని చెప్పలేదు. ఇక సానియా మీర్జా ఈ మద్య యూఎస్ ఓపెన్ లో టైటిల్ సాధించటం పట్ల భర్తగా గర్వపడ్డాడు. ఈ విజయం కోసం భారత్, పాక్ లో ని ప్రతి ఒక్కరూ ప్రార్ధించి ఉంటారన్నాడు. శుక్రవారం మ్యాచ్ ప్రాక్టిస్ తర్వాత సానియా ఇంటికి జట్టు సభ్యులను తీసుకుని భోజనానికి వెళ్ళి.., అత్తవారింటి వంటకాల రుచి చూశాడు హైదరాబాదీ అల్లుడు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more