భారత దిగ్గజ బ్యాట్స్ మెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శుక్రవారంనాడు హైదరాబాద్ నగరంలో సందడి చేశారు. ముఖ్యంగా ఈయన సికింద్రాబాద్ లో వున్న ప్యారడైజ్ హోటల్ లో టిఫిన్ తిని, ఇరానీ చాయ్ తాగారు. కాగా సచిన్ రాక గురించి తెలుసుకున్న స్థానికులు, అభిమానులు ప్యారడైజ్ వద్ద పెద్దఎత్తున బారులు తీరారు. పోలీసులు సైతం వీరిని అదుపు చేయలేకపోయారు. దీంతో కొద్దిసేపటి వరకు ఆ ప్రదేశంలో సందిగ్ధత ఏర్పడింది.
కొద్దిసేపటి తరువాత పోలీసు బలగాలు అభిమానులను కంట్రోల్ చేయడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు తన మీద కనబరుస్తున్న ప్రేమకు, అభిమానానికి థ్యాంక్స్ చెప్పుకున్నారు. ఆ సమయంలోనే కొంతమంది అభిమానులతోపాటు పోలీసులు కూడా సచిన్ తో ఫోటోలు దిగారు. ప్యారడైజ్ హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు సచిన్ ఇక్కడకు విచ్చేసినట్లు ఆయన తెలిపారు.
గతంలో కూడా ఈ ప్యారడైజ్ హోటల్ ఆహ్వానం మేరకు ఎంతోమంది రాజకీయ నాయకులు హాజరయ్యారు. అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్యారడైజ్ బిర్యానీ రుచి చేశారు. అలాగే ఎంపీలు ప్రియాదత్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్ వంటి తదితర ప్రముఖులు కూడా ఈ హోటల్ బిర్యానీ రుచి చూసినవారే! ఏదేమైనా సచిన్ రాకతో అభిమానులు మాత్రం సందడి చేసుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more