భారతదేశ దిగ్గజ బ్యాట్స్ మెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలుసుకునే అవకాశం వరిస్తే... అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ముందు వరుసలో నిల్చుని వెయిట్ చేస్తాడు. ఆయనతో కలిసి ఒక్క ఫోటో దిగాలన్న కోరిక ప్రతిఒక్కరిలో వుంటుంది. కానీ ఒక్క మహిళా క్రీడాకారిణీ మాత్రం సచిన్ ను చూసి భయపడుతోందట! ఆమె ఎవరో కాదు.. భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం అయిన పుసర్ల వెంకటసింధు..!
సింధు, సచిన్ లు మంచి సన్నిహితులే! 2012లో సింధు జూనియర్ ఛాంపియన్ షిప్ లో మంచి విజయాన్ని సాధించిన తొలి భారత షట్లర్ గా చరిత్ర సృష్టించింది. దాంతో ఎందరో ప్రముఖులు ఆమె ఘనతను మెచ్చుకున్నారు. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా ఆమెను అభినందిస్తూ ఒక కార్ కూడా గిఫ్ట్ గా బహుకరించాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటివే మరిన్ని విజయాలు అందుకోవాలని ఆ సందర్భంగా వ్యాఖ్యానించాడు. దాంతో ఆమె సచిన్ కు వీరాభిమాని అయిపోయింది.
ఇప్పుడు తాజాగా బ్రిటన్ లో నిర్వహిస్తున్న కామన్వెల్త్ క్రీడల్లో కూడా వెంకటసింధు పాల్గొంటోంది. దీంతో యావత్తు భారతదేశ అభిమానులు మొత్తం ఆమె మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ కామన్వెల్త్ క్రీడల సందర్భంగా సచిన్ కూడా బ్రిటన్ లోనే వున్నాడు. ముఖ్యంగా సచిన్ ఈ క్రీడల్లో సింధు ఆడే మ్యాచ్ ల మీదే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడు. దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని, అంతటి క్రికెట్ దిగ్గజం తన మ్యాచ్ లను వీక్షించడం ఎంతో టెన్షన్ ను గురిచేస్తోందని... ఆయన ముందు తాను ఆటను సరిగ్గా ప్రదర్శిస్తుందో లేదోనని తెగ భయపడిపోతోందట అమ్మడు!
దీంతో ఈ అమ్మడికి ఈ క్రీడలు సవాల్ గా మారిపోయాయి. ఒకవైపు భారత అభిమానులు, మరోవైపు సచిన్ అంచనాలను ఎలా ఎదుర్కోవాలా అంటూ తీవ్ర ఒత్తిడికి లోనవుతోందని తన సహచర ఆటగాళ్లు తెలుపుతున్నారు. మరీ ఈ అమ్మడు తన ఒత్తిడిని భరించి సచిన్, ప్రేక్షకుల ఆశయాలను నిలబెడుతుందా..? క్రీడల్లో ఎలా అధిగమిస్తుంది..? అన్న విషయాలను తెలుసుకోవడానికి వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more