కథ :
పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులకు నలుగురు కూతుళ్లు, నలుగురు కొడుకులు వుండేవారు. వారందరిలో చివరి వాడయిన కొడుకుది తప్ప... మిగతా వాళ్లందరికి పెళ్లిళ్లు అయిపోయాయి. అందరూ సుఖసంతోషాలతో తమ జీవితాన్ని గడిపేవారు.
కానీ పెళ్లిళ్లయిన వారిలో చివరి కూతురిది పేద సంసారం కాబట్టి ఆమెను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. ఏ శుభకార్యాలు జరిగినా, ఏ పండుగలు చేసుకున్నా.. ఆమెను పుట్టింటివారు పిలిచేవారు కాదు. తమ పిల్లల్ని కూడా వారు రానించుకునేవారు కాదు. ఆమె తన తల్లిదండ్రుల ఇంటిపక్కనే వున్న శిథిల గృహంలో వుండేది. దీంతో తీవ్ర మానసికంతో ఆమె ఎల్లప్పుడూ బాధపడుతూ తన జీవితాన్ని కొనసాగించేది.
ఒకరోజు ఆ బ్రాహ్మణుడి చివరి కొడుకు పెళ్లిరోజు రానేవచ్చింది. ఆ పెళ్లికి ప్రతిఒక్క బంధువుని, చుట్టుపక్కలవారందరినీ ఆహ్వానించారు. కానీ పేద జీవనం సాగిస్తున్న ఆమెను మాత్రం పిలవలేదు.
ఇదంతా గమనించిన ఆ బ్రాహ్మణ ఇంటి పెద్దకోడలు ఆ కడసారి కూతురు కోసం చింతిస్తుంది. అప్పుడు ఆమె పెళ్లివంటలకోసం ఉంచిన బియ్యంలో నుంచి అడ్డేడు తవ్వెడు కడిగిన బియ్యాని తీసి ఒక కొత్త చేటలో పోస్తుంది. అలాగే కడగని బియ్యాన్ని కూడా ఆ చేటలో పోస్తుంది.
అనంతరం ఒక వావిలి చెట్టు కొమ్మను, రవికెల గుడ్డను, దక్షిణ తాంబూలాలను అందులో వుంచుతుంది. ఇవన్నీ ఇంకొక కొత్త చేటలో వుంచి.. తమ ఇంటిపక్కనే వున్న శిథిలగృహంలో వుంటున్న పేదపడుచుకి.. ఆ రెండిళ్ల మధ్య వున్న గోడమీద వాయనాన్ని అందిస్తుంది.
అలా ఆమె అందుకున్న ఆ వాయనంతో తన దరిద్రం అంతా తొలగిపోయి క్రమక్రమంగా ఒక మంచి జీవితాన్ని గడుపుతుంది. అలాగు తన తోబుట్టువాళ్లందరీకంటే ధనవంతురాళ్లయిపోతుంది.
కొన్నాళ్ల తరువాత ఆమె పెద్దనాన్నివారి ఇంట్లో వారి కూతురి కళ్యాణం ఏర్పడుతుంది. పేద జీవితం నుంచి విముక్తి అయి సంపన్నురాలయిన కారణంగా ఆమెను కూడా కూతురి కళ్యాణానికి ఆహ్వానిస్తారు. స్వయంగా అన్నావదినలే ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి పందిట్లోకి తీసుకుని వస్తారు.
అక్కడున్న ప్రతిఒక్కరు ఆమెను ఎంతో ఆదరణతో పలకరించసాగారు. ఆమెకు పిండివంటలన్నీ వడ్డించి భోంచేయమని చెప్పారు. అప్పుడు ఆమె తన ఒంటిమీదున్న నగలన్నీ తీసి.. తనకు వడ్డించి పళ్లెం మీద వుంచుతుంది. అప్పుడామె.. ‘‘ఓ ఆభరణాల్లారా.. ఈ భోజనాన్ని ఆరగించండి’’ అంటూ ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
చుట్టుపక్కలవున్నవారు ఆమెను అడ్డగించి.. ‘‘నువ్వెందుకు ఏమి తినకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నావు’’ అని ప్రశ్నించారు. అందుకు ఆమె చిరునవ్వుతో ఇలా అంటుంది... ‘‘నా పుట్టింటివాళ్లు నన్ను ఇక్కడ ప్రేమతో కాదు.. నా ఆభరణాలు చూసి ఇక్కడికి పిలిచారు. నేను పెట్టుకున్న నగలు చూసే వారు నామీద ప్రేమను చూపిస్తున్నారే తప్ప.. నామీద వాళ్లకు కొంచెమైనా ప్రేమలేదు. అందుకే నా ఆభరణాలే భోజనం చేస్తాయని అలా వదిలేశాను’’ అంటుంది.
ఆ మాటలు విన్న పుట్టింటివారు తమ తప్పును తెలుసుకుని, క్షహించమని వేడుకున్నారు. దీంతో వారంతా సుఖంగా గడపడం మొదలుపెట్టారు.
అక్కడున్నవారు ఆమె చుట్టూ చేరి.. ‘‘ఇంతకు నువ్వు ఇన్ని సంపదలు ఎలా సాధించగలిగావు’’ అని అడిగితే.. దానికి ఆమె ‘‘నేను ఎటువంటి వ్రతాలుగాని, నోములగాని నోచుకోలేదు. మా పెద్దొదిన నాకు పెరటి గోడమీద నుంచి వావిలి గౌరీ నోము వాయనమిచ్చింది. అవి అందుకున్న పుణ్యానికి నాకు ఈ సంపదలు కలిగాయి’’ అని సమాధానం ఇస్తుంది.
అప్పుడు ఆ మాటలు విన్న స్త్రీలు... ‘‘వాయనం నోము అందుకున్నందుకే ఇన్ని సందపలు లభించినప్పుడు.. ఆ నోమును నోచుకున్నవారికి ఇంకెన్ని భోగభాగ్యాలు అందుతాయో’’నని అనుకుంటూ.. అందరూ ఆ నోము నిర్వహించుకోవడం ప్రారంభించారు.
విధానం :
ఒక సంవత్సరంపాటు ప్రతి లక్ష్మీవారము వావిలి చెట్టునుగాని, కొమ్మను గాని గౌరీదేవిగా భావించి, పూజించుకోవాలి. తరువాత పైన చెప్పుకున్న కథను చెప్పి... అక్షతలు వేసుకోవాలి.
ఉద్యాపనం :
ఒక కొత్త చేటలో అడ్డేడు తవ్వెడు కడిగిన బియ్యాన్ని, కడగని బియ్యాన్ని పోసి.. ఆ బియ్యం మీద వావిలి కొమ్మనూ, ఒక కొత్త రవికెల గుడ్డనూ, దక్షిణ తాంబూలాలను వుంచి.... వాటిని ఒక పాత చేటతో మూతపెట్టి ముత్తైదువులకు గోడమీద నుంచి వాయనమివ్వాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
May 07 | కథ : పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more