ఆశ్వయుజమాసంలో వచ్చే నవరాత్రుల గురించి పెద్దగా చెప్పుకునే అవసరం లేదు. ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులపాటు ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ సౌభాగ్యం కోసం.. అలాగే పిల్లలు తమ చదువుసంధ్యల కోసం దుర్గను పూజించి ఆమెను ప్రసన్నం చేసుకోవాలని పరితపిస్తుంటారు.
‘‘శ్లో || సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే, శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే’’
శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో పేర్కొన్నారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని, పరమేశ్వరు పగటి రూపం గలవాడని భావిస్తారు. అందుచేత దేవిని రాత్రిపూట అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే శనివారం రోజున అందరూ ఉదయాన్నే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. ఎర్రటి పట్టు వస్త్రములు ధరించి పూజకు ఉపయోగపడే వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
కలశముపై అలంకరించేందుకు ఎర్రటి వస్త్రము, దుర్గాదేవి ఫోటో (సింహవాహిని) లేదా దుర్గాదేవి ప్రతిమను పూజమందిరములో ఉంచాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులు, పోగడ పువ్వులతో దుర్గమ్మను అలంకరించుకోవాలి. తర్వాత నైవేద్యానికి పొంగలి, పులిహోర, దానిమ్మపండ్లు సిద్ధం చేసుకోవాలి. అలాగే దూదితో ఎర్రటి వత్తులుగా చేసి ఆవునెతితో దీపారాధనకు దీపం తయారు చేసుకోవాలి. 9 వత్తులతో ఆవునేతితో హారతిని సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం ఆరు గంటల నుంచి 9 గంటలకు వరకు పూజ చేయాలి. పూజకు ముందు దుర్గాదేవి అష్టోత్తరం, దుర్గాద్వాదళిత్రిశంనన్నామాలు, అర్జునకృత దుర్గాస్తోత్రము, దుర్గా సహస్రనామాలను పఠించాలి.
శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే రోజున విజయవాడ, అష్టాదశశక్తిపీఠనములు వంటి దుర్గాదేవి ఆలయాలను దర్శించుకోవడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా ఆలయాల్లో దుర్గాదేవి అష్టోత్తర పూజ, కుంకుమార్చన చేయిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పూజచేసే సమయంలో ఆగ్నేయం వైపు తిరిగి ప్రార్థించాలి. నుదుట కుంకుమ ధరించి "శ్రీ మాత్రేనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత దీపారాధన, నైవేద్యం సమర్పించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులను పిలిపించి తాంబూలములో పసుపు, కుంకుమలతో పాటు రాహుకాలంలో దుర్గాపూజ, దేవీ లీలామృతం, దేవి స్తోత్రమాల వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా శుభం కలుగుతుందని పురోహితులు అంటున్నారు.
దశమి ప్రాభవం
అశ్వని నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వయుజమాసము. శరదృతువులో ఇది మొదటి నెల. ఆశ్వయుజశుద్ధపాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రులనీ ,దశమినీ విజయదశమి అని పండుగ చేసుకోవడం అనాదిగాఉంది. తొమ్మిది రోజులు చేసుకునే పండుగ నవరాత్రి, దేవిని పూజిస్తారు కనుక శరన్నవరాత్రులనీ అంటారు.దీన్నే విజయదశమి అనీ పిలుస్తారు. శ్రీ రాముడు రావణునితో యుద్ధం చేయడానికి వెళ్ళిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు ,జగన్మాత మహిశాసురుడ్న్నివధించిన రోజు కాబట్టి విజయదశమి అయిందని కొందరు,అజ్ఞాతవాసం పూర్తిఅయినతరువాత విజయుడు జమ్మిచెట్టులో దాచిన ఆయుధాలను తీసుకుని శత్రువుల్ని ఓడించినరోజు కాబట్టి విజయదశమి అయిందని పెద్దలు చెప్తారు.
ఈ దసరా తొమ్మిది రోజులు సుమంగళి పూజ ,కుమారిపుజ చేస్తారు .పదేళ్లలోపు ఆడపిల్లలకు తలంటు పోసి ,పిండి వంటలతో భోజనంపెట్టి ,కొత్త బట్టలుపెట్టి సత్కరిస్తారు.ఇళ్ళలోను ,దేవాలయల్లోను ,కలశపూజలు ,చండిహోమంలు శాస్త్రబద్ధంగా చేస్తారు. మూల నక్షత్రం సప్తమినాడు సరస్వతి పూజ ,అష్టమినాడు దుర్గాపూజ ,సప్తమినాడు ఆయుధపూజ చేయడం సంప్రదాయం .విజయదశమి నాడు కొత్త ప్రారంబిస్తే ఆ పని విజయవంతం మవుతుందని విశ్వాసం.విజయదశమి సాయంత్రం శమి శమియతే పాపం అని జమ్మి చెట్టును పూజిస్తారు .
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more