శివారాధనలో ప్రధానమైనది అభిషేకం, మారేడు దళాలతో పూజించడం. ఒక్కో ఫలాన్ని ఆశించి ఒక్కో విధంగా శివుడిని పూజించే ఆచారమున్నది. ఏ ఫలం కోసం ఏ పూజ చేయాలో మనం తెలుసుకుందాం..!
మనసులో ఏమీ కోరుకోకుండా పువ్వులతో పూజ చేస్తే ముక్తి లభిస్తుందని అంటారు.
ధనాన్ని కోరుకునేవారు - పద్మాలు, మారేడు దళాలతో పూజించాలి. అలాగే బియ్యపు గింజలతో అచ్చించినా ఇదే ఫలం కలుగుతుంది.
ఇంట్లో శాంతికోసం జలాభిషేకం, శతృనాశనానికి తైలాభిషేకం చేయాలి.
మన ఆరోగ్యం కోసం 59వేల పువ్వులతో శివుడిని అర్చించాలి.
సంపెంగ, మొగలిపూలతో మాత్రం శివుడిని పూజించరాదు.
ఇలా ఒక్కో పూజతో ఒక్కో కోరిక తీరుతుంది. శివరాత్రిరోజు చేసే అర్చన మరింత ఫలానిస్తుందని భావిస్తారు. మహాశివరాత్రికి ముందురోజు ఉపవాసం వుండి పవిత్రంగా గడపాలి. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, దేవాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయాలి. ఆరోజు రాత్రి జాగరణం చేయాలి. మొదటి ఝాములో పాలతోను, రెండవ ఝాములో పెరుగుతోను, మూడవ ఝాములో నేతితోను, నాల్గవ ఝాములో తేనెతోనూ అభిషేకం చేయాలి. ఇది చేయలేనివారు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయాలి. లింగోద్భవ సమయంలో శివుడిని దర్శించుకోవడం చాలా మంచింది. ఆ తరువాత మరుసటి రోజు ఉదయానికి ఉపవాస దీక్ష విరమించుకోవాలి. ఇవి శివరాత్రిరోజు పాటించాల్సిన నిధులు.
రుద్రాక్ష మహిమలు :
రుద్రాక్షలను శివుడి ప్రతిరూపాలుగా కొలుస్తారు. ఇవి మహా శక్తివంతమైనవి. పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకగా వీటిని పేర్కొంటారు. ఇవి ధరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయని, సమస్త దరిద్రాలూ తొలగిపోతాయని, సుఖసంతోషాలతో గడపవచ్చుని భావిస్తారు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుందని విశ్వసిస్తారు. వీటిని ఋషులు భూమికి, స్వర్గానికి మధ్య వారథిగా భావిస్తారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే.. అవి మటుమాయమవుతాయి. అంతేకాదు.. చెడుఅలవాట్లకు లోయయినవారు.. తాము చేసేది తప్ప అని తెలిసీ వాటి నుంచి బయటపడకపోతున్నవారు వీటిని ధరిస్తే మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్నవారిని దర్శంచుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందని భావిస్తారు. మునులు ఈ రుద్రాక్షను సర్వపాపములను నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు.
రుద్రాక్షలను ధరించినవారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని వున్నాయి.
1. ఈ రుద్రాక్షమాల ధరించి శృంగారంలో పాల్గొనరాదు.
2. మైలపడిన వారిని తాకరాదు
3. మాల ధరించి శ్మశానానికి వెళ్లరాదు.
4. కుటుంబ సభ్యులయినా కూడా ఒకరి మాలను మరొకరు ధరించకూడదు.
5. చేతికి ఉంగరాలు ధరించరాదు.
6. రుద్రాక్షమాలను దరించి నిద్రపోరాదు.
7. స్త్రీలు కూడా రుద్రాక్షమాలను ధరించవచ్చు కానీ, రుతుసమయంలో ధరించరాదు.
ధారణ విధి -
సోమవారం లేదా పుష్యమీ నక్షత్రంనాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షను తెచ్చి స్నానం చేయించి, శుద్ధి చేసి శివపూజ చేయాలి. అప్పుడే వీటిని ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఫలితం కోసం ఎదురు చూడరాదు. ఫలితం కోసం ధరించేవారు పూర్తి విధానంతో, సాధనతో గురువు సమక్షంలోనే ధరించాలి.
రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు -
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి, శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజ చేయడం మహా శ్రేష్ఠం. వీటిని ధరిస్తే సర్వదు:ఖాలూ తొలిగిపోయి, సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపురాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియాలోని తిమూర్, దక్షిణాసియాలోని నేపాల్ లోనూ, ఇండియాలోనూ చాలా కొద్దిచోట్ల రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 18 | అమృత ప్రాప్తి మంత్రం : శంఖినీ యక్షిణీ సాధన మంత్రం శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more