హిందూ సంప్రదాయాల ప్రకారం.. ఏదైనా ఒక మంచి కార్యంలోగానీ లేదా వివాహ శుభకార్యాలలోగానీ వధూవరులపై పెద్దలు అక్షతలు చేసి ఆశీర్వదించడం ఒక ప్రాచీన ఆచారం. అంతేకాదు.. దేవాలయాలలో కూడా పూజారులు మంత్రాక్షలతో ప్రతిఒక్కరిని దీవిస్తారు. సాధారణంగా ‘‘అక్షతలు’’ అనే మాట ‘‘అక్షింతలు’’ నుంచి వచ్చింది. క్షతం కాని అక్షతలు అంటే.. రోకలి పోటుకు కూడా విరగని శ్రేష్ఠమైన బియ్యం. అటువంటి బియ్యానికి పసుపు, కుంకుమ, నేతితో కలిపి.. అక్షతలను తయారుచేస్తారు.
సాధారణంగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ధ్యానాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగానే చంద్రునికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. చంద్రుడు మానవ మనస్సుకు అధినాయకుడు. మనిషిలో వుండే మనసు, బుద్ధి, గుణం, వ్యసనం వంటి మొదలైనవన్నీ చంద్ర కారకాలే అని పూర్వం పురోహితులు, పెద్దలు పేర్కొన్నారు. అందుకే చంద్రుని ప్రభావం మనిసిపై ఎక్కువగా వుంటుంది. అదేవిధంగా మానవుని మనస్సుపై బియ్యం, చంద్రునిలా తన ప్రభావం చూపుతుంది.
శాస్త్రీయపరంగా ఆలోచిస్తే.. మానవుని దేహం మొత్తం విద్యుత్ సరఫరాలతో కూడి వుంటుంది. ఆ విద్యుత్ సరఫరాల్లో జరిగే హెచ్చుతగ్గుల కారణంగా మనిషి ఆరోగ్యం మీద, మనస్సు మీద ప్రభావం చూపుతుంది. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లినప్పుడు.. ఆ సమయంలో దేహంలో వుండే విద్యుత్తులో కొంతభాగం ఈ అక్షతలు తాకుతాయి. అప్పుడు ఆశీస్సులు ఇచ్చేవాళ్ల నుంచి, పుచ్చుకునే వాళ్లకు కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. అలా ఆ విధంగా అక్షతల ద్వారా పెద్దలలో వుండే సాత్విక గుణాలు, పిల్లలకు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగి వుంటారు. ఇదే అక్షతలలో వున్న పరమార్థం.
అక్షతలతో కలిగే ప్రయోజనాలు :
శాస్త్రీయప్రకారం.. మనిసి దేహంలో విద్యుత్ కేంద్రాలు 24 వుంటాయి. వాటిలో ప్రధానమైంది శిరస్సు. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేసి.. శరీరమంతటా ప్రసారం చేస్తుంది. తలపై అక్షింతలు వేయడం ద్వారా.. అందులో వున్న విద్యుత్తును శిరస్సు గ్రహించి మొత్తం దేహానికి ప్రసారం చేస్తుంది.
ఆయుర్వేద లెక్కలప్రకారం... చర్మానికి సంబంధించి రోగాలను అడ్డుకునే శక్తి పసుపుకు వుంది. అలాగే పసుపు నుంచి తయారయ్యే కుంకుమకు కూడా ఇదే శక్తి వుంటుంది. వీటిని బియ్యంలో కలిపి అక్షతలుగా చేసి, ఇతరులపై వేసినప్పుడు వారికి ఎలాంటి రోగాలు రావు. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధులు సోకవు. అంతేకాక పసుపు, కుంకుమలు శుభానికి సంకేతాలుగా పనిచేస్తాయి.
శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా భగవద్గీతలో ‘‘అన్నాద్భవన్తి భూతాని’’ అని మూడవ అధ్యాయంలో చెప్పాడు. అంటే.. జీవులు అన్నంతో పుడతారు. ఈ అన్నం తయారికీ ఉపయోగపడేది ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే.. జీవులు ఈ అన్నంలో పుట్టి, తిరిగి భగవంతునిలోని చేర్చడం అన్నమాట. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు అని అంటారు. ఇందులో తలను అంటే తలమీద పోయబడే, ప్రాలు అంటే బియ్యం అని అర్థం.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more