కథ :
పూర్వం ఒకనాడు ఒక రాజు, మంత్రి ఇద్దరూ కలిసి మారువేషంలో తమ రాజ్యంలో తిరుగుతుంటారు. అలా తిరుగుతుండగా వారిమీద ఒక బందిపోటు దాడి చేస్తారు. మారువేషంలో వున్న రాజు, మంత్రి ఆ బందిపోటును ప్రతిఘటిస్తుండగా... అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు చూసి, తనవంతు సాయం చేస్తాడు.
దాంతో రాజు మెచ్చుకుని ‘‘నీకు ఏం బహుమానం కావాలో కోరుకో’’ అని అడుగుతాడు. అప్పుడు రుద్రసేనుడు.. ‘‘మీరు ఆపదలో వున్నారని కాపాడడానికి వచ్చానే తప్ప.. ఏదో ఆశించి రాలేదు’’ అని చెబుతాడు. దానికి రాజు ఇంకా సంతోషించి.. ‘‘నీకు ఎప్పుడు సహాయం కావాలన్న నన్ను కోరుకో’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఈ విధంగా జరిగిన వృత్తాంతం గురించి రుద్రసేనుడు మొత్తం తన భార్య శాంతశీలకు చెబుతాడు. అప్పుడు ఆమె కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన తరువాత రుద్రసేనుడితో ఇలా అంటుంది...
‘‘కొద్దిరోజుల క్రితం కట్టెలకోసమని నేను అడవికి వెళితే అక్కడ ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆ మునీశ్వరుడు నాతో.. ‘‘తల్లీ! నీకో విషయం చెబుతాను విను. శుక్రవారంరోజు లోకమంతా చీకటిగా వున్నప్పుడు ఎవరి ఇళ్లల్లో దీపం లేకుండా చూసుకుని, కేవలం నీ ఇంట్లో మాత్రమే దీపం వుండేటట్లు చూసుకో. దీపం పెట్టి ఇంటి గుమ్మం దగ్గర కూర్చోని వుండు. అప్పుడు ఆ సమయంలో చీకటిని భరించలేక నల్లని చీరను ధరించిన ఒకామె నీ ఇంటినుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి, ‘‘బయటకు వెళితే లోపలికి రాకూడదు’’ అనే షరతు విధించు.. ఆమె నీకు సమాధానంగా.. ‘‘నేను లోపలుండే ఈ వెలుగుని భరించలేను. చీకటిలోకి వెళ్లిపోతాను’’ అని చెబుతుంది.
కొద్దిసేపు తరువాత ఇంకొకామె ధగధగమెరిసే నగలతో ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి.. ‘‘లోపలికి వెళితే బయటకు వెళ్లకూడదు’’ అనే షరుతును విధించు. ఆమె నీకు సమాధానంగా.. ‘‘బయట వుండే చీకటిని భరించలేను.. లోపలికే వెళ్లిపోతాను’’ అని చెబుతుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు అష్టఐశ్వర్యవుంతురాలివి అవుతావు’’ అని మునీశ్వరుడు, శాంతశీలకు చెప్పినట్టు తన భర్త రుద్రసేనుడితో చెబుతుంది.
అప్పుడు శాంతశీల వెంటనే రాజు దగ్గరకు వెళ్లి తాను ఎవరో చెప్పుకుంటుంది. అలాగే వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం వెలగకుండా వుండేలా చూడమని ఆమె ఆ రాజుతో కోరుకుంటుంది. రాజు ఆమె కోరికను మన్నించి శుక్రవారంరోజు ఎవరూ దీపం వెలిగించకుండా చాటింపు చేయిస్తాడు.
మునీశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ఇంటికి నల్లని చీర కట్టుకుని వున్న ఒకామె ఇంట్లోనుంచి బయటకు వెళ్లిపోయి... అష్టఐశ్వర్యవంతురాలయిన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాంతో ఆమె సిరిసంపదలతో ఐశ్వర్యవంతురాలయిపోతుంది. అయితే అందరి ఇళ్లలో రాజుగారిచేత దీపం వెలిగించకుండా చేసినందుకు ఆమె చాలా బాధపడుతుంది.
అలా బాధపడుతూ ఆమె ఒకరోజు లక్ష్మీదేవిని ప్రార్థించి, క్షమాపణలు కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఆమె ప్రార్థనను మెచ్చుకుని... ‘‘ఇకపై ప్రతిశుక్రవారం సాయంత్రంవేళ ఎవరయితే దీపం వెలిగిస్తారో.. వారందరి ఇళ్లల్లోకి నేను ప్రవేశిస్తాను’’ అని వరం ప్రసాదిస్తుంది.
ఇలా ఈ విధంగా ప్రతిశుక్రవారం లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, సంధ్యాసమయంలో దీపం వెలిగిస్తే... లక్ష్మీదేవి మన ఇళ్లలో కూడా దర్శనమిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more