ఆలయ విశేషాలు :
ఛాయ సోమేశ్వర ఆలయం నల్లగొండ పట్టణానికి నాలుగు కీలోమీటర్ల దూరంలో వున్న పానగల్లు అనే గ్రామంలో వుంది. క్రీ.శ. 12వ శతాబ్దంలో కుందూరు చోళులు దీనిని నిర్మించినట్టు ప్రస్తుతమున్న మ్యూజియం విభాగాలు తెలుపుతున్నాయి.
వాస్తుశాస్త్రాలలో జరిగే అద్భుతాలలో ఈ ఆలయాన్ని కూడా ఒకటిగా పేర్కోవచ్చు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ కొన్ని విచిత్రాలు వున్నాయి. అవి ఎందుకలా అవుతున్నాయో ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఈ దేవాలయంలో రెండు ప్రత్యేకమైన విశేషాలు వున్నాయి.
అందులో మొదటిది... ఈ సోమేశ్వర ఆలయంలోని గర్భగుడిలో ఒక నీడ, ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో వుంటుంది. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్థంభాలు వున్నప్పటికీ.. ఒకే నీడ పడుతుంది. సూర్యుని గమనంలో మార్పు వచ్చినప్పటికీ.. ఆ నీడ మాత్రం కదలకుండా ఒకే స్థానంలోనే వుండిపోతుంది. ఆ వెలుతురు ఎందుకలా వుంటుందో, దానివెనకున్న రహస్యమేంటో ఇంతవరకు అంతుచిక్కని విషయంగా మారిపోయింది.
రెండవది.. ఈ ఆలయానికి దగ్గరలోనే వున్న చెరువులో నీరు ఎక్కువగా వుంటే.. గర్భగుడిలో కూడా ఆ నీరు ఉబికి బయటకు వస్తాయి. ఒకవేళ ఆ చెరువు ఇంకిపోతే.. గర్భగుడిలో వున్న నీరు కూడా ఎండిపోతుంది. అందుకే ఈ ఆలయాన్ని వాస్తుశాస్త్ర అద్భుతంగా పేర్కొంటారు.
ఆలయ నిర్మాణం :
సోమేశ్వర ఆలయానికి పడమరవైపుగా వున్న గర్భగుడిలో శివలింగం మీదుగా స్తంభాకారంలో సూర్యునితో సంబంధం లేకుండా సాయంత్రం వరకు అలాగే ఒకే స్థానంలో వుండడం ఆలయం అద్భుతం. అసలు ఆ నీడ ఏ వస్తువు నుంచి ఏర్పడుతుందోనన్నది విశేషం. ఆలయానికి మధ్యభాగంలో ఒక చతురస్రాకారంలో వుండి దానికి మూడువైపులా మూడు గర్భగుడులు కలిగి వుంటాయి.
ఆలయానికి రాళ్లతో కూడిన పునాదిని నిర్మించడం వల్ల.. భవిష్యత్తులో భూకంపాల ప్రభావాలు వచ్చినప్పటికీ ఆలయం కూలిపోకుండా, ఆ నీడ చెదిరిపోకుండా వుండేవిధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్వం అన్ని కార్యాలు దేవాలయాలలోని జరిగేవి కాబట్టి.. రాజులు కూడా వాటిని ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిర్మించుకునేవారు.
(And get your daily news straight to your inbox)
May 09 | స్థలపురాణం : పూర్వం త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయాలని నిర్ణయించుకుని.. దక్షిణ హిందూ దేశానికి వెళతాడు. ఆ సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో వున్న ఒక కొండ ప్రాంతానికి... Read more
Apr 18 | మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు... Read more
Apr 03 | స్థలపురాణం : పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు.. తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ.. తల్లిని చంపినందుకు తీవ్ర... Read more
Mar 28 | స్థలపురాణం : పూర్వం వజ్రనాభ అనే రాక్షసుడు నిత్యం ప్రజలను హింసిస్తూ.. వారికి అనేక కష్టాలను పెట్టేవాడు. ఇది చూసి తట్టుకోలేక బ్రహ్మ.. తన చేతిలో వున్న తామరపువ్వును ఆయుధంగా మార్చి ఆ రాక్షసుడని... Read more
Mar 20 | యమధర్మరాజు ఆస్థానంలో కూర్చొని మానవులు చేసే పాప, పుణ్య కర్మలను లెక్కించి, చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా కొన్ని దేవాలయాలు వున్నాయి. తెల్లవారుజాము లేచిన క్షణం నుంచి మనం నిత్యం నిర్వహించుకునే కార్యక్రమాలతో... Read more