కాకతీయ స్కూల్ బస్సును ఢీకొన్న రైలు
గురువారం ఉదయం మెదక్ జిల్లాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాసాయిపేట రైల్వేగేట్ వద్ద విద్యార్థులతో కిక్కిరిసిపోయిన ఒక స్కూల్ బస్సును రైలు ఢీకొంది. ఇందులో దాదాపు 21 మంది విద్యార్థులు చనిపోగా... మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో దాదాపు 30 మంది దాకా విద్యార్థులు వున్నట్టు సమాచారం! ఈ విషాదంలో చాలా మలుపులే చోటు చేసుకున్నాయి. బస్సు డ్రైవర్ రాకపోవడం వల్ల అతని స్థానంలో ట్రాక్టర్ డ్రైవర్ ని స్కూల్ యాజమాన్యంవారు పంపించినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన కొన్ని దృశ్యాలు....