స్కార్ప్ కట్టుకున్న వాళ్లకి రైల్లో అనుమతి లేదు..!

 

ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషనులో రూ. 12 లక్షల దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకనుండి ముఖం కనిపించకుండా స్కార్ప్ కానీ, మఫ్లర్, దుప్పట్టా కట్టుకున్న వారికి రైల్లో ప్రవేశించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం దీని నుండి మినహాయింపు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించే ముందు చెకింగ్ చేసే సమయంలో ముఖం ముసుగులు తీసివేయమని చెబుతారని, దీని ద్వారా వారి ముఖాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమవుతాయని తెలిపారు. ఆ విధంగా దొంగలను పట్టుకోవడం కొంతవరకూ సాధ్యమవుతుందని తెలిపారు.