తెలంగాణ నుండి రూ. 2,500 కోట్లు వసూలు చేయండి.. చంద్రబాబు

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు (ఏపీఎస్ఈబీ) భేటీ ఆయ్యాయి. ఈ సందర్బంగా వారు రూ.1000 కోట్లకు పైగా విలువైన హైదరాబాద్ లోని ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో లకు చెందిన ఆస్తులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఏపీ, తెలంగాణా విద్యుత్ సంస్థలకు చెందిన ఆస్తుల విభజనకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కమిటీని నియమించేందుకు చొరవ తీసుకోవాలని సూచించింది. దీంతో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఎం వేదవ్యాసరావు, సీహెచ్ విజయభాస్కర్ తదితరులు వున్నారు.