పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించ వచ్చా అన్న ప్రశ్నకు బోంబాయ్ హైకోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ ఏడాది ఇచ్చిన పలు సంచలన తీర్పుల జాబితాలో ఈ తీర్పు చేరింది. పరస్పర అంగీకాంతో జరిగే శృంగారాన్ని అ తరువాత కొన్నాళ్లకు రేప్ గా పరిగణించలేమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. బాగా చదువుకున్న అమ్మాయిలు పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత మనసులు విడిపోయినప్పుడు అత్యాచారం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇటీవలి కాలంలో కొందరు ప్రియురాళ్లు లవర్స్ తమను రేప్ చేశారని చేశారని కూడా కేసులు పెడుతున్నారు. ఈ తరహా ఆరోపణలకు బలముంటుందా? అసలు ఏది పరస్పర అంగీకార శృంగారం? ఏది రేప్? ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉపయోగపడుతుంది.
ముంబైకి చెందిన ఇద్దరు లాయర్లు 1999 నుంచి ప్రేమించుకుంటున్నారు. 2006 నుంచి వారి మధ్య శారీరక సంబంధం ఉంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకోవడం లేదని 2009లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కానీ ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగింది. చివరకు ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి కావడంతో అతడు తనను మోసం చేశాడని, కొంతకాలం పాటు రేప్ చేశాడని 2013లో ఆమె కేసు పెట్టింది. అయితే తమ మధ్య పరస్పర అంగీకారంతోనే శారీరక సంబంధం కొనసాగిందని అతడు కోర్టులో వాదించగా.. అతడి వాదనలో బలముందని భావించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదులా భత్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈరోజుల్లో పెళ్లికి ముందు సెక్సువల్ రిలేషన్స్ గతంలో ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. ఏ జంటయినా సెక్స్ అనుభూతి కావాలని కోరుకోవచ్చు. ముంబై, పుణె లాంటి నగరాల్లో సమాజంలో ఈ స్వేచ్ఛ పెరుగుతూ వస్తోంది. ఈ మార్పును కోర్టు పట్టించుకోకుండా ఉండలేదు. నేడు సహజీవనాన్ని చట్టం గుర్తిస్తోంది.
అలాగే శృంగారం కావాలా? వద్దా? తల్లి కావాలా? వద్దా? అనే హక్కులు కూడా మహిళకు ఉన్నాయని చట్టం చెబుతోంది. అందువల్ల ఒక పరుషుడితో మహిళకు ఉన్న శారీరక సంబంధం స్పృహతో పెట్టుకున్నదా? కాదా? అనే అంశాన్ని ఏ కేసుకు ఆ కేసు విడిగా తేల్చాల్సిందే. అన్ని సందర్భాలకు తగ్గట్లు ఒకే రకమైన తీర్పు చెప్పలేం. జంట మధ్య ప్రేమ ఇంకిపోయిన తరువాత అంతకుముందున్న సంబంధాన్ని రేప్గా పరగణించలేం.ఈ కేసులో ఆమె ఒక విద్యావంతురాలు. స్పృహతోనే ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడిందనే విషయాన్ని తోసిపుచ్చలేం'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more