
మిల్కీవైట్ బ్యూటీ తమన్నా కొత్త హంగు సాధించింది. శ్రీదేవి, రేఖ, ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా, కత్రినాకైఫ్....తదితర హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది ఈ కాశ్మీరీ భామ. ప్రస్తుతం తెలుగు,తమిళంలో మంచి అవకాశాలే చేతిలో పెట్టుకొన్న తమన్నా తాజాగా లక్స్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. ఇకపై ఈమె లక్స్ రాసుకొంటూ యాడ్స్ లో కనువిందు చేయనుంది. ఈ మేరకు తమన్నా లక్స్ తో ఒప్పందం కుదుర్చుకొంది.
ఈ మధ్య అసిన్, కాజల్ అగర్వాల్ లు కూడా లక్స్ యాడ్స్ లో కనిపించారు. వారితో ఒప్పందం మాట ఏమో కానీ తమన్నా గ్లామర్ ను లక్స్ వారు ఉపయోగించుకోవాలనుకొంటున్నారు. త్వరలోనే తమన్నాతో యాడ్ షూటింగ్ ఉంటుదని, మనిష్ మల్హోత్రా ఈ యాడ్ ను బ్యాకాంక్ లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తమన్నా ఈ మధ్య ఒక బాలీవుడ్ సినిమాలో కూడా అవకాశం సంపాదించింది. అజయ్ దేవగణ్ హీరోగా రీమేక్ అవుతున్న 'హిమ్మత్ వాలా' లో తమన్నా హీరోయిన్ గా నటించనుంది
