దేశ ప్రధాని నరేంద్రమోడికి గండం ఉన్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అక్టోబర్ 2న మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని ‘స్వచ్ఛ భారత్’ పేరుతో పారిశుద్య కార్యక్రమం చేపట్టారు. ఈ పారిశుద్య కార్యక్రమంలో ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇందులో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసి మరి ‘స్వచ్చ భారత్’లో పాల్గొనేలా చేశారు. ఇప్పుడిదే కార్యక్రమం మోడికి మొదటి గండంగా అంతా అనుకుంటున్నారు. మోడి, ఆయన ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి ముప్పు తప్పదు అని అంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో వైఎస్ కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇదే తరహాలో పారిశుద్య కార్యక్రమాలు చేపట్టారు. ‘జన్మభూమి’, ‘శ్రమదానం’ వంటి కార్యక్రమాలతో ఉద్యోగులతో పనిచేయించారు. అటు రాత్రి బడులు, ఇంకుడుగుంతల సర్వే ఇతర కార్యక్రమాల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు లేకుండా కష్టపెట్టారు. అప్పటికే రైతులు, సామాన్యుల నుంచి వ్యతిరేకత ఎదుర్కున్న బాబుకు ఉద్యోగుల నుంచి కూడా ఇబ్బంది తప్పలేదు. ఎన్నికల్లో బాబుకు వ్యతిరేకంగా ఉద్యోగులు కాంగ్రెస్ కు ఓట్లు వేశారు. ఈ విషయాన్ని బాబు కూడా దృవీకరించి... తర్వాత తాను ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది నిజమే అని అంగీకరించారు. తన ఓటమిలో ఉద్యోగుల ఆగ్రహం కూడా ఫలితాన్ని ప్రభావితం చేసి పదవికి దూరం చేసిందని బాధపడ్డారు కూడా.
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడి కూడా ఇదే తరహాలో శ్రమదానం పేరును మార్చి ‘స్వచ్చ భారత్’ అనే పేరుతో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం మొదలు పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టి సర్కారు ఉద్యోగుల సెలవులు రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే మోడిపై ఉద్యోగులకు కోపం వస్తుందని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇదే జరిగితే గతంలో బాబుకు వచ్చిన ఫలితమే భవిష్యత్తులో మోడికి వచ్చే అవకాశమూ ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. చూడాలి మరి ఉద్యోగులు కోపం తెచ్చుకుంటారా... లేక అర్ధం చేసుకుని మెలుగుతారా అనేది ఎన్నికల ఫలితాలు చూస్తేనే తెలుస్తుంది. ఉద్యోగుల గండం మోడికి ఉండకూడదు అనే అంతా కోరుకుందాం.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more