
టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ సినిమాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పూరిజన్నాథ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా ‘‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో భారీ వ్యయంతో ఓ సెట్ ని కూడా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐటెం సాంగుని షూట్ చేస్తున్నారు.
సినిమా పేరు ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నిలిస్టు గా కనిపించనున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని సినీ జనాల టాక్. పవన్ ఈ చిత్రంలో మెకానిక్ గా కనిపించి అలరించనున్నారట. ఫిలింనగర్ సమాచారం ప్రకారం హీరోయిన్ తమన్నా ..గంగగా మీడియాకు చెందిన వ్యక్తిగా కనిపిస్తుంది. ఆమెకు మెకానిక్ గా ఉండే పవన్ తో కలిసి సమాజానికి పనికివచ్చే రిపేర్స్ చేయిస్తుంది. మెకానిక్ గా ఉండే అతను కెమెరా తో సమాజంలోని కొన్ని దారుణాలను ప్రజల ముందుకు తీసుకువచ్చి అవకతవకలను సరిచేస్తాడని చెప్పుకుంటున్నారు. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ కాదని, మెకానిక్ అని అంటున్నారు. ఏ పాత్ర పోషిస్తున్నాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
