ఇటీవల రామ్ చరణ్ హీరోగా 'రచ్చ' హిట్ సినిమాని రూపొందించిన దర్శకుడు సంపత్ నంది, తాజాగా జాక్ పాట్ కొట్టినట్టు భోగట్టా. పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాన్ని ఇతనితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. 'రచ్చ' లాగానే, పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ ను పవన్ కల్యాణ్ కి సంపత్ ఇటీవల వినిపించాడనీ, పవన్ వెంటనే ఓకే చెప్పాడనీ సంపత్ సన్నిహితులు చెబుతున్నారు. పవన్ పచ్చ జెండా ఊపడంతో ఆ ఆనందంతో స్క్రిప్ట్ పని మీద సంపత్ కూర్చున్నాడట. పవన్ అభిమానులను రంజింపజేసే విధంగా ఆయా సన్నివేశాలనూ, డైలాగులను ప్రస్తుతం అతను తీర్చిదిద్దుతున్నాడు. త్వరలోనే రివైజ్డ్ వెర్షన్ తో పవన్ ని కలిసే ప్రయత్నాలలో వున్నాడు. 
కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన యాక్షన్ దృశ్యాలను నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరిస్తున్నారు. హైదరాబాదు, గచ్చిబౌలిలోని అల్యామినియం ఫ్యాక్టరీలో రాత్రి వేళల్లో వీటిని షూట్ చేస్తున్నారు. ఈ షూటింగులో పవన్, ఫైటర్లు పాల్గొంటున్నారు. ఈ దృశ్యాలు సినిమాలో ఇంటర్వెల్ ముందు వస్తాయని అంటున్నారు. ఈ చిత్రీకరణ పూర్తయ్యాక రామోజీ ఫిలిం సిటీలో ఓ పాటను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
...avnk