వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న నిత్యానంద సినీ నటి రంజితతో కలిసి విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. నిత్యానంద శిష్యుడు కౌషిక్ను పోలీసులు ఇవాళ (గురువారం) న్యూఢిల్లీలో అరెస్టు చేశారు. అతని నుండి 32 పాసుపోర్టులు
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ అంశానికి సంబంధించి పలు విషయాలు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రంజితతో కలిసి నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు తప్పించుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యానంద ప్రస్తుతం రంజితతో కలిసి మానస సరోవర యాత్రలో ఉన్నారు. ఆ యాత్ర అనంతరం అటు నుండి నేరుగా నేపాల్ వెళ్లేందుకు నిత్యానంద, రంజితలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
నిత్యానంద గత పదిహేను రోజులుగా తప్పించుకు తిరుగుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్ష చేసేందుకు సహకరించడం లేదు. మరోవైపు కోర్టు కూడా అతనికి బెయిల్ నిరాకరించింది. దీంతో ఏ క్షణంలోనైనా పోలీసులు అతనికి అరెస్టు వారెంట్ జారీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉంటే మరిన్ని అక్కట్లు వస్తాయని భావించిన నిత్యానంద విదేశాలకు చెక్కేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. రంజితతో పాటు మరో ముప్పై మంది శిష్యులతో అతను ప్రస్తుతం హిమాలయాలలో ఉన్నాడు. హిమాలయాలలో ఉన్న నిత్యానంద ట్రావెల్ ఏజెట్ల ద్వారా తన మిగిలిన శిష్యుల పాసుపోర్టులను వెనక్కి పంపించాడు. కేవలం శిష్యులను తిరిగి వెనక్కి పంపించి అతను రంజితతో పాటు నేపాల్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడని భోగట్టా...
...avnk