పలు వాయిదాల పిమ్మట మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘దేవుడు చేసిన మనుషులు’ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయనున్నామని హైదరాబాద్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఈ చిత్ర నిర్మాత తెలిపారు. గోవా బ్యూటీ ఇలియానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ చిత్రం లోని అన్ని పాటలను భాస్కర భట్ల రాశారు. ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తమ ఆనందాన్ని తెలిపారు. ఈ చిత్రం క్లీన్ ఎంటర్టైనర్ అని పూరి జగన్నాథ్ అన్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆంధ్రావిశేష్ కు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అందాల భామ ఇలియానా ఇంతకుముందెన్నడూ లేని రీతిలో చాలా విభిన్నంగా గ్లామరస్ గా కనిపించనుందని తెలుస్తోంది. ఇలీ ని పూరీ చాలా డిఫెరెంట్ గా చూపించాడని తెలుస్తోంది. అందుకు ఉదాహరణ ఇదిగో ఈ ఫొటో అనుకోవచ్చు...అందాకా....
....avnk