టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ‘రామాయణం’ ప్రాజెక్ట్ను రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రామాయణ మహాకావ్యంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తీసుకొని తెరపై ఆవిష్కరించారు. అయితే, తొలిసారి మొత్తం రామాయణాన్ని మూడు భాగాలుగా అది కూడా 3డి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ రామాయణాన్ని తెరకెక్కించనున్నారు. ఈ భారీ చిత్రం నిర్మాణం కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో అల్లు అరవింద్ జతకట్టారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్కు దర్శకత్వం వహించనున్నారు. తొలి భాగం 2021లో విడుదలవుతుంది. అయితే, తొలిభాగాన్ని నితీష్ తివారి తెరకెక్కించనున్నారు.
‘దంగల్’ తరవాత తాజాగా ‘చిచ్చోరి’ లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తివారి ప్రస్తుతం ‘రామాయణం’ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్ రాముడిగా, దీపికా పదుకొణె సీతగా నటించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ భారీ చిత్రంలో ప్రభాస్ కూడా నటించనున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రావణుడి పాత్రలో ప్రభాస్ను నటింపజేయాలని మేకర్స్ చూస్తున్నారట. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రూ.600 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఇది హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా తెరకెక్కనుంది కాబట్టి పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈ ప్రాజెక్ట్లోకి వస్తే సినిమాకు బలం చేకూరుతుందని మేకర్స్ భావించారని సమాచారం.
రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడి పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్గా సరిపోతారని దర్శక నిర్మాతలు నిర్ణయించారట. అయితే, ఇది ఇంకా చర్చల దశలో ఉందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభాస్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట. ఒకవేళ ప్రభాస్ గనుక ఈ పాత్ర చేయడానికి ముందుకొస్తే భారత సినీ చరిత్రలో ఇది మరో సంచలనాత్మక చిత్రం కావడం ఖాయం.
ఇదిలా ఉంటే, చిత్ర తారాగణం విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దర్శకుడు నితీష్ తివారి అంటున్నారు. ఇటీవల ‘పింక్విల్లా’ వెబ్సైట్తో మాట్లాడిన ఆయన తాము ఇంకా కాన్సెస్ట్ లెవెల్లోనే ఉన్నామని చెప్పారు. తారాగణం గురించి ప్రస్తుతానికి ఆలోచించడం లేదని అన్నారు. దర్శకుడు ఇలా చెబుతున్నప్పటికీ లోపల అయితే చర్చలు జరుగుతున్నాయన్నది టాక్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more