Dil Raju accused of stealing ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం కాపీయేనట..

Court says prabhas mr perfect is a copy

young rebel star prabhas, Prabhas, Mr Perfect, Dil Raju, Dasaradh, Hyderabad Civil Court, Shyamaladevi, novel 'Naa Manasu Korindhi Ninne', copyright case, Kajal, Taapsee, Prakash Raj,movies, entertainment, tollywood

The Hyderabad Civil Court has declared that hero Prabhas 2011 movie 'Mr. Perfect' is a copy of a novel by name 'Naa Manasu Korindhi Ninne.' Writer of the novel, Shyamaladevi had filed a copyright case in the year 2017.

ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రం కాపీయేనట..

Posted: 04/22/2019 10:02 PM IST
Court says prabhas mr perfect is a copy

సినిమారంగంలో ఒక సమస్యకు ఇద్దరు డైరెక్టర్లకో లేక సినీ కథ రచయితలకో ఒకే విధమైన అలోచన రావచ్చు. అయితే ఇళా కాకతాళీయంగా జరిగినా.. చిత్రసీమలో మాత్రం అది తన క్రియేటివిటీ అని తన కథను కాపీ కొట్టారన్న ఆరోపణలు రావడం సహజమే. ఇటీవల పలు చిత్ర కథల విషయంలో ఇలాంటి అరోపణలు రావడం సహజమైపోయింది. ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన Mr. పర్‌ఫెక్ట్ కథ కూడా కాపీ కొట్టారనే వార్త తాజాగా సంచలనం సృష్టిస్తుంది. ఔనా..? అయినా ఎప్పుడు 2011లో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు కాఫీ అనే విషయం హాట్ టాపిక్ ఎలా అయ్యిందంటారా.. ఈ మేరకు కోర్టులో నడుస్తున్న కేసుపై ఇవాళ న్యాయస్థానం తీర్పునివ్వడంతో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దశరథ్ డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మించిన Mr.పర్‌ఫెక్ట్ సినిమా 22-04-2011 లో రిలీజ్ అయ్యింది. కాజల్, తాప్సీ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది. రిలీజ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత, టీవీలో సినిమా చూస్తూ, తను వ్రాసిన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవలను కాపీ కొట్టి, Mr.పర్‌ఫెక్ట్ తీసారని గ్రహించిన రచయిత శ్యామలా దేవి కోర్ట్‌‌‌‌లో కేసు వేశారు. గతకొద్ది కాలంగా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆమె చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది.

Mr.పర్‌ఫెక్ట్ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు.. శ్యామలా దేవి రాసిన నవలలోనివే అని సిటీ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. టీవీలో చూసే వరకూ తన నవలని కాపీ చేసారని తెలియదని, దిల్ రాజుని కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, రచయితలో సంఘంలో కంప్లైంట్ చేస్తే, దశరథ్ తప్పుడు ఆరోపణలు చేసాడని, తప్పకుండా దిల్ రాజు దగ్గరినుండి నష్ట పరిహారం వసూలు చేస్తానని రచయిత శ్యామలా దేవి అన్నారు. 22-04-2019 నాటికి Mr.పర్‌ఫెక్ట్ రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా కోర్టు తీర్పునివ్వడం విశేషం. శ్యామలా దేవి వ్యాఖ్యలపై Mr.పర్‌ఫెక్ట్ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Mr Perfect  Dil Raju  Dasaradh  Hyderabad Civil Court  Kajal  Taapsee  Prakash Raj  tollywood  

Other Articles