Sai Dharam Tej's Chitralahari Teaser: Fresh Breath ప్రేక్షకులను అకట్టుకుంటున్న చిత్రలహరి టీజర్

Sai dharam tej and kalyani priyadarshan starrer looks fun and exciting

Chitralahari, Chitralahari Teaser, Sai Dharam Tej, Kalyani Priyadarshan, Nivetha Pethuraj, Sunil, DSP, mythri movie makers, sai dharam tej, chitralahari film, chitralahari cast, chitralahari release, sai dharam tej film, sai dharam tej news, sai dharam tej latest film, sai dharam tej news, tollywood, movies, entertainment

Actors Sai Dharam Tej and Kalyani Priyadarshan starrer Chitralahari teaser is out and is receiving a positive response on social media. The teaser of the film was launched on Wednesday in Rama Naidu Studios in Hyderabad.

ప్రేక్షకులను అకట్టుకుంటున్న సాయిధరమ్ తేజ్ చిత్రలహరి టీజర్

Posted: 03/13/2019 09:25 PM IST
Sai dharam tej and kalyani priyadarshan starrer looks fun and exciting

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన యువనటుడు సాయిధరమ్ తేజ్ తన అశలన్నీ తన తదుపరి చిత్రం చిత్రలహరిపైనే పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ఆయన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సందడి చేయకపోవడంతో.. ఈ చిత్రమైనా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కావడం.. ఈ సంస్థ నుంచి ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించడంతో ఆయన ఆశలన్నీ ఈ చిత్రంపైనే వున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 'చిత్రలహరి' సినిమా నుండి చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. 'చిత్రలహరి.. అప్పట్లో దూరదర్శన్ లో ప్రతి ఫ్రైడే వచ్చే ఓ ప్రోగ్రామ్.. ఈ చిత్రలహరి.. 2019 లో ఓ ఫ్రైడే రిలీజ్ అవబోయే సినిమా. అందులో కొన్ని పాటలు, ఇందులో కొన్ని పాత్రలు' అంటూ టీజర్ మొదలవుతుంది. ఇక ఒక అమ్మాయిలో మూడు విభిన్నమైన పాత్రలను కూడా దర్శకుడు టీజర్ ద్వారా ప్రేక్షకులకు చూపించాడు.

హీరో తేజ్ ‘‘నా పేరు విజయ్.. నా పేరులో వున్న విజయం నా జీవితంలోకి ఎప్పుడోస్తుందో.. అంటూ సాగే డైలాగ్ పూర్తికాకముందే కరెంటు కట్ అవ్వడం.. ఈ లోపు ఓ పిల్లాడు వచ్చి వచ్చినప్పుడు చూసుకుందువులే అన్నా.. నీ దెబ్బకు కరెంట్ కూడా పోయింది.. అన్నగానే.. బాధపడకు బాబాయ్ నీకు ఓ మంచి రోజు వస్తుంది అనగానే మళ్లీ తేజ్.. ఆ వచ్చేదెదో ఆదివారం రోజు రమ్మని చెప్పు బాబాయ్.. ఇంటిదెగ్గరే ఖాళీగా వుంటాను అంటూ సెటైర్ వేయడం.. ప్రేక్షకులలోకి బాగా వెళ్లలేలా వుంది. కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన క‌థానాయిక‌లుగా కల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేద పేతురాజ్‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న‌ విడుదల అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles