నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు కథానాయికలు కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. వాళ్లలో కీర్తి సురేశ్ .. మేఘ ఆకాశ్ .. ప్రియా వారియర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఆ వార్తల్లో నిజం ఉందనేది, ఈ రోజున ఈ సినిమా లాంచ్ సందర్భంలో తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి కార్తికేయ కూడా హాజరయ్యాడు. అంతేకాదు నాని .. విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. అయితే పైన పేర్కొన్న ముగ్గురు కథానాయికలు కాకుండా, ఈ రోజున పూజా కార్యక్రమాల్లో మరో కథానాయిక మెరిసింది. ఈ కొత్తమ్మాయి ఎవరనే విషయమే తెలియాల్సి వుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more