రాయ్ లక్ష్మీ వెండితెరపై గ్లామరస్ హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి ఎంతోమంది అభిమానులు వున్నారు. అలాంటి రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారిగా 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' సినిమా రూపొందుతోంది. శ్రీధర్ రెడ్డి .. ఆనంద్ రెడ్డి .. ఆర్కే రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఏ మాయ చేసిందో .. ఏ మంత్రం వేసిందో .. చూపులతో తీసిందే ప్రాణం. ఊరించే ఆ అందం .. ఊహల్లో ఆనందం .. గుండెల్లో గుచ్చిందే బాణం" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. రాయ్ లక్ష్మీ పై మనసు పారేసుకున్న కమెడియన్స్ ప్రవీణ్ .. మధుసూదన్ ఊహలకు అక్షర రూపంగా ఈ పాట వస్తుందని అర్థమవుతోంది. బాలాజీ సాహిత్యం .. హరి గౌర సంగీతం - గానం ఆకట్టుకునేలా వున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more