సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను షూటింగ్ జెట్ స్పీడ్ తో తెరకెక్కుతోంది. స్పైడర్ సినిమా మూలంగా ఆలస్యం కావటంతో ఈ సినిమా షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగానే .. జనవరిలో తన 25వ సినిమాను ప్రారంభించాలని మహేశ్ భావించాడు.
ఈ దిశగా దర్శకుడు వంశీ పైడిపల్లి సెట్స్ వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే 'స్పైడర్' ఎఫెక్ట్ కారణంగా 'భరత్ అనే నేను' ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టిన మహేశ్ బాబు .. తన తర్వాతి చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన్నట్టుగా సమాచారం. ఈ కారణంగానే హడావిడిగా ఈ సినిమాను మొదలుపెట్టకుండా, 'భరత్ అను నేను' విడుదలైన తరువాతనే 25వ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడని సమాచారం.
మహేశ్ కెరియర్ లోను .. అభిమానుల దృష్టిలోను సంఖ్యా పరంగా 25వ సినిమాకి ప్రత్యేకత ఉంటుంది కనుకనే మహేశ్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రంలో రకుల్ ను హీరోయిన్ గా తీసుకునే ఫ్లాన్ లో మేకర్లు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more