సుమారు 8 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో సమావేశం కాబోతున్నాడు. అసలు అంతకు ముందు సినిమాకు ముందు ఫ్యాన్స్ ను కలవటం రజనీ ఆనవాయితీగా పాటిస్తూ వచ్చేవాడు. అయితే అనారోగ్య సమస్యలతో కొంత కాలంగా ఆ పని చేయటం లేదు. చాలా గ్యాప్ తర్వాత తలైవాను కలిసే అవకావం రావటంతో ఉబ్బితబ్బిబి అవుతున్నారు. కానీ, ఈ మీటింగ్ హాజరు కావాలంటే మాత్రం ఓ కండిషన్ కూడా తప్పక పాటించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం జిల్లాల వారీగా అభిమానులకు ఐడీ కార్డులను పంచుతోంది అఖిల ఇండియా రజనీకాంత్ తలైమై రసిగర్ మంద్రం అనే సంఘం. వీటిని ఎవరైతే ధరించి వస్తారో వారిని మాత్రమే మీటింగ్ కు అనుమతిస్తారు. అంతేకాదు రజనీతో వారు ఫోటో దిగేందుకు కూడా అనుమతిస్తారు. ఐడీ మిస్సయితే మాత్రం ఇక అంతే. లోపలికి కనీసం అలో కూడా చేయరని ఓ ప్రకటనలో ఆ సంఘం పేర్కొంది.
ఇక చాలా గ్యాప్ తర్వాత జరుగుతున్న సమావేశం కావటంతో రాజకీయ కోణంలో కూడా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. వారి ఒత్తిడితోనైనా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తాడేమో చూడాలి మరి. 15 నుంచి 19 దాకా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ భేటీ జరగనుంది.
రజనీ, ధనుష్ కి నోటీసులు...
సూపర్ స్టార్ రజనీకాంత్, కబాలి దర్శకుడు పా రంజిత్ తో మరోసారి జత కడుతున్న విషయం తెలిసిందే. ముంబై డాన్ రోల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని టాక్. రజనీ అల్లుడు ధనుష్ సినిమాకు నిర్మాత. అయితే ముంబై రెండు దశాబ్దాలపాటు గడగడలాడించిన స్మగ్లర్ హజి మస్తాన్ లైఫ్ పైనే ఈ చిత్రం ఉండబోతుందని కొంత కాలంగా టాక్ నడుస్తోంది. దావూద్ అనుచరుడిగా హజి దందాలు నడిపాడని పోలీసుల ఆరోపణ.
దీనిపై నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. హజి కొడుకు దత్తత సురేందర్ శేఖర్ ఈ విషయంపై రజనీ అండ్ ధనుష్ కు నోటీసు పంపించాడని, తన తండ్రి ప్రస్తావన వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించినట్లు పేర్కొన్నాయి. దీనిపై రజనీగానీ, ధనుష్ తరపు నుంచి గానీ ఇంకా ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతుండగా, ఓ బాలీవుడ్ హీరోయిన్ రజనీకి జోడిగా నటిస్తుందని టాక్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more