బాహుబలి సినిమా యావత్ దేశ ప్రజలను ఆకట్టుకోవటంతోపాటు, పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుమారు 600 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు నుంచి నేటి దాకా హాట్ టాపిక్ గా నిలవటానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఇది. రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో దాని మీద పడినన్నీ సెటైర్లు మరేయితర సినిమాపై కూడా పడి ఉండకపోవచ్చు. సినిమాలో సీరియస్ అయిన ఈ టాపిక్ నెటిజన్లపాలిట మాత్రం సిల్లీగా మారిపోయింది. ఇక ఈ ప్రశ్నకు సమాధానం చివరికి చిత్ర యూనిట్ లో ఇద్దరు ముగ్గురికి తప్ప ఎవరికీ తెలీదు. రాజమౌళికి, రచయిత విజయేంద్ర ప్రసాద్కు, ప్రభాస్కు, సత్యరాజ్లకు మాత్రమే తెలుసు. అంతే రహస్యంగా షూటింగ్ కూడా చేశారు. ఆ మధ్య తమన్నా నాక్కూడా తెలుసని చెప్పినప్పటికీ, ఆ పై ఉత్తదేనని చెప్పుకొచ్చింది. కానీ, దేశ భద్రత కోసం ఆ సీక్రెట్ ను రాజమౌళి ఓ కేంద్ర మంత్రికి చెప్పేశాడంట.
కేంద్ర సమాచార శాఖా మంత్రి(మినిస్టర్ ఆఫ్ స్టేట్) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. స్వయంగా రాజమౌళే తనకు ఆ చెప్పాడని అంటున్నాడు. గోవాలో జరుగుతున్న 47వ ఇఫీ(IFFI) ఫిలిం ఫెస్టివల్కు హాజరైన ఆయన ఈ విషయం చెప్పారు. ‘బాహుబలి లాంటి గొప్ప చిత్రాన్ని అందించినందుకే కాదు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో ఆ సీక్రెట్ నాకు చెప్పినందుకు రాజమౌళికి థ్యాంక్స్. మా ప్రభుత్వానికి అన్నీ తెలియాలి. అలాగే దేశ భద్రత కోసం తెలిసిన రహస్యాలను మా ప్రభుత్వం కాపాడుతుంది. ఆ విషయం రాజమౌళికి తెలుసు. అందుకే నాకు చెప్పారు. ఈ సీక్రెట్ నా దగ్గరే సేఫ్గానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించాడు. సరదాగా చేశాడో.. సీరియస్ గా చేశాడో తెలీదుగానీ రాథోడ్ చేసిన ఆ వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయించాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more