ఆయన పంచిన నవ్వులను ఏరుకుంటూ ఈనాటికి లాఫింగ్ థెరపీగా వాడుకుంటున్నారు ఎందరో. జాతకాల పిచ్చోడిగా అలరించాలన్న, పిసినారి పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అప్పులతో జీవితం నెట్టుకొచ్చిన, మోసాలతో లైఫ్ లో సెటిల్ అయినా, ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ అన్నా... ఇలా ఎలాంటి పాత్రలతో అయినా నవ్వులు పూయించడం ఒక్క నటకిరీటికి మాత్రమే సొంతం. అసలైన హాస్యం విషాదం నుంచే పుడుతుందనటానికి రాజేంద్ర ప్రసాదే నిదర్శనం. చిన్న తనంలోనే తల్లి చనిపోవటంతో ఆ బాధను దిగమింగుకునేందుకు హాస్యాన్ని ఆశ్రయించారు. ఆపై అవే నవ్వులు మనకు పంచారు. చిన్నప్పుడే ముఖానికి రంగు వేసుకుని నాటకాలు వేశారు. రాజేంద్రుడిలోని పట్టుదల చూసిన నటసార్వభౌముడు స్వర్గీయ ఎన్టీఆర్ ఆయన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. జంధ్యాల, వంశీ, రేలంగిలతోపాటు ఇవీవీ, ఎస్పీ కృష్ణారెడ్డి.... ఆపై మరికొందరు ఇలా మూడు తరాల దర్శకులతో ఆయన పని చేశారు. ముఖ్యంగా హాస్యబ్రహ్మ జంధ్యాలతో మరిచిపోలేని చిత్రాలను అందించాడు. రాజేంద్రుడి చిత్రాలను రీమేక్ చేసే సీన్ దమ్ము ఇప్పుడున్న దర్శకులకు లేదు. ఎందుకంటే ఆయనలా అభినయించే హీరోలు లేకపోవటమే అందుకు కారణం. హీరోగా రాణిస్తున్న టైంలోనే 90వ దశకంలో నిర్మాతగా మారి కొన్ని చిత్రాలు తీసి, చేతులు కాల్చుకున్నారు. కాస్త గ్యాప్ తో ఆయన్నే వెతుకుంటూ ఆనలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ తరం హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రలు పోషిస్తూ అలరిస్తున్న నటకిరీటి, ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈరోజు(జూలై 19) ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి....
- రాజేంద్ర ప్రసాద్ పూర్తి పేరు డాక్టర్ గద్దె బాబూ రాజేంద్రప్రసాద్. 1956 జూలై 19న కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన జన్మించారు.
- సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లామా పూర్తి చేసిన రాజేంద్ర ప్రసాద్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహం(1977) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. నాలుగ దశాబ్దాలకు చేరువైన ఆయన సినీ ప్రస్తానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించారు.
- ప్రేమించు పెళ్లాడు చిత్రంతో హీరోగా మారినప్పటికీ, ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం వంశీ లేడీస్ టైలర్(1986).
- 1991లో రిలీజ్ అయిన ఎర్ర మందారం సినిమాకు తొలిసారిగా నంది అవార్డు అందుకున్న రాజేంద్ర ప్రసాద్. 1994లో రిలీజ్ అయిన మేడమ్ సినిమాకు స్పెషల్ జ్యూరి అవార్డ్ ను అందుకున్నారు. ఇక పాతికేళ్ల తర్వాత మరోసారి 2004లో ఆ నలుగురు చిత్రానికి ఉత్తమ నటుడిగా నందిని అందుకున్నారు.
- తెలుగు, తమిళ్ లో మొత్తం కలుపుకుని 230కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన క్విక్గన్ మురుగన్ పేరుతో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రంలోనూ హీరోగా నటించారు.
- ఆయన హీరోగా నటించిన పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, మీ శ్రేయోభిలాషి చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నాయి.
- నటకిరిటీగా, కామెడీ కింగ్ గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకునే రాజేంద్రుడిని ఆంధ్రా యూనివర్సిటీ గౌరమ డాక్టరేట్ తో సత్కరించింది.
ప్రస్తుతం నటుడిగానే కా మా అధ్యక్షుడు తెలుగు కళామతల్లి సేవచేసుకుంటున్నారు ఈ నవ్వుల రారాజు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ... తెలుగు విశేష్ తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాం..
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more