ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం మొదటి భాగం ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశం
రసభసాగా మారింది. ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి, నటుడు రానా, చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డలతో పాటు ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, డివివి దానయ్య తదితరులు పాల్గొన్నారు.
‘బాహుబలి’ చిత్రాన్ని పైరసీ కాకుండా అడ్డుకోవాలిన రాజమౌళి, అల్లు అరవింద్ విన్నవించారు. అయితే ఈ సంధర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు రాజమౌళి ఒకింత అసహనం వ్యక్తం చేసారు. టికెట్ల ధర ఎక్కువగా వుండటం వల్లనే పైరసీ విస్తరిస్తోందంటూ మీడియా వారు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై రాజమౌళి తనదైన శైలిలో కాస్త ఘాటు సమాధానమిచ్చారు.
ఈ ప్రశ్నకు రాజమౌళి మాట్లాడుతూ... గతంలో టికెట్స్ తక్కువ వున్న రోజుల్లో కూడా పైరసీ వుంది... మరి అప్పుడు ఎందుకు పైరసీ జరిగింది అంటూ రాజమౌళి మీడియా వారిని ఎదురు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాబసగా సాగింది. అయితే వెంటనే నిర్మాత అల్లు అరవింద్ ఈ విషయంలో కలుగజేసుకొని ‘బాహుబలి’ చిత్రాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది మీడియా వారే... కాబట్టి.. అనవసరంగా మీకు మాకు మధ్య వాగ్వాదం ఎందుకు? దయచేసి మాకు సహకరించండి అంటూ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేసారు.
అయితే ‘బాహుబలి’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో కొన్ని ఛానెల్స్, పత్రికా వాళ్లకు మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కొంతమంది మీడియా ప్రతినిథులు ప్రశ్నించగా... నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ... షెడ్యూల్ ప్రకారం అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నామని తెలిపారు. ‘బాహుబలి’ థియేటర్లలో చూడాల్సిన సినిమా అని, సెకండ్ షో తర్వాత పైరసీ జరుగుతోందని, పైరసీకి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని రాజమౌళి కోరారు.
అలాగే అల్లు అరవింద్ మాట్లాడుతూ... దయచేసి సినిమాను పైరసీ చేయవద్దని, పైరసీకి పాల్పడకుండా థియేటర్లలో కట్టడి చేయాలని అన్నారు. ‘బాహుబలి’ తెలుగు వారు గర్వపడే సినిమా, ఎవరైనా పైరసీకి పాల్పడితే మానిటరింగ్ సెల్ కు తెలియజేయాలని, ఒకవేళ ఎవరైరనా ఉద్దేశ్య పూర్వకంగా పైరసీ చేస్తే
థియేటర్లపై ఏడాది పాటు నిషేదం వుంటుందని ఈ సంధర్భంగా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more