నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్ నిర్మాతలకు పోటీగా రంగంలోకి దిగుతున్నారు. అంటే.. వారికి వ్యతిరేకంగా ఆయన ఎటువంటి ప్రణాళికలు రచించడం లేదులెండి! ఈయన కూడా ఇకనుంచి ప్రోడ్యూసర్ అవతారం ఎత్తనున్నారు. ఈయనతోపాటు నటుడు శివాజీ కూడా ఈ వ్యాపారంలో భాగస్వామ్యం పంచుకోనున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ‘రాజా & రాజా క్రియేషన్స్ (ఆర్&ఆర్ ప్రొడక్షన్స్)’ పేరిట సొంత బ్యానర్ మొదలు పెట్టబోతున్నారు. కొత్త నటీనటులకు అవకశాలు కల్పించడం కోసం.. ఆఫర్లు లేక ఖాళీగా కాలక్షేపం చేస్తున్నవారికోసం వీరిద్దరూ కలిసి ఈ బ్యానర్ నిర్మిస్తున్నారని, ఈ బ్యానర్ లో టీవీ సీరియళ్లతోపాటు సినిమాలు కూడా నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత.. పేద కళాకారులకు చేదోడు వాదోడుగా నిలుస్తు.. వారి సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ నటుడు శివాజీ రాజా ‘మా’ జనరల్ సెక్రటరీగా కొనసాగుతూ రాజేంద్ర ప్రాసద్ కు మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. వీరిద్దరి అనుబంధం ఒక్క ‘మా’ బంధం మాత్రమే కాదు.. గత 30 ఏళ్ళుగా మంచి మిత్రులుగా వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అందులో భాగంగానే రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజా కలిసి ‘రాజా & రాజా క్రియేషన్స్’ పేరిట ఒక కొత్త బ్యానర్ ను స్థాపించబోతున్నారు. మే 29 న ముహూర్త కార్యక్రమం జరుపుకున్నారు కూడా! ఈ సందర్భంగా తమ బ్యానర్ గురించి కొన్ని విషయాలను వారిద్దరూ తెలియజేశారు. ‘రాజా అండ్ రాజా క్రియేషన్స్’లో ముఖ్యంగా టీవి కార్యక్రమాలతోపాటు సినిమాలను కూడా నిర్మించబోతున్నట్లుగా వారు తెలిపారు.
త్వరలోనే 'ఈ' టీవిలో ఓ ప్రొగ్రామ్ ను మా బ్యానర్ లో మొదలు పెట్టబోతున్నాం. అలాగే మిగతా అన్ని ఛానల్స్ లోనూ మరిన్ని మంచి ప్రొగ్రామ్స్ అందించబోతున్నాం. రాబోయే కాలంలో మా బ్యనర్ పేరు నిలబెట్టే విధంగా మంచి మంచి టీవి కార్యక్రమాలతోపాటు సినిమాలను నిర్మించడమే మా ధ్యేయం. మా ఇద్దరి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్నరాజా & రాజా క్రియేషన్స్ విజయ పథంలో సాగాలని.. అందుకు మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాతే గా ఈ కార్యక్రమం జరపాలనుకున్నప్పటికీ..ఈ రోజు (మే 29) బాగుండడంతో ముహూర్తం కార్యక్రమం మాత్రమే జరిపినట్టు తెలియజేశారు. మిగతా విషయాలను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
రాజా & రాజా క్రియేషన్స్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా రాజేంద్ర ప్రసాద్ తనయుడు బాలాజీ..శివాజీ రాజా అల్లుడు కిరణ్ కుమార్ వర్మ వ్యవహరించనున్నారు. ఈ ముహూర్తపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కైకాల సత్యనారాయణ..నాగి రెడ్డి-చక్రపాణిలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని రాజేంద్ర ప్రసాద్-శివాజీ రాజాలను ఆశీర్వదించారు. అలాగే ప్రముఖ దర్శకుడు ఎస్.వి.క్రిష్ణా రెడ్డితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి విచ్చేసి తమ తమ బెస్ట్ విషెష్ ను అందించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more