అక్కినేని నాగచైతన్యకు రొమాంటిక్ హీరోగా మంచి హిట్ ను అందించిన చిత్రం ‘ఏమాయ చేసావే’. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో భారీ విజయం సాధించింది. తమిళంలో శింబు హీరోగా నటించాడు. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ వీరి ముగ్గురి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతుంది.
తెలుగులో నాగచైతన్య, తమిళంలో శింబు హీరోలుగా గౌతమ్ మీనన్ ఏకకాలంలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మలయాళ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బెంగుళూర్ లో జరుగుతోంది. హారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.
‘ఏమాయ చేసావే’ తరహాలోనే సాగే రొమాంటిక్ ప్రేమకథాచిత్రమని తెలిసింది. ఈ సినిమాపై నాగచైతన్య, శింబు ఇద్దరూ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్టయితే మళ్లీ వీరికి భారీ క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more