‘దోచేయ్’ తర్వాత నాగచైతన్య హీరోగా ‘కార్తీకేయ’ ఫేం దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను ఖరారు చేసారు. ఈ విషయాన్ని దర్శకుడు చందు కన్ఫర్మ్ చేసారు.
త్వరలోనే నాగచైతన్య, తమన్నాలతో ఓ సినిమా ప్రారంభం కానుందని తాజాగా చందు తెలియజేసాడు. నాగచైతన్య, తమన్నాల కాంబినేషన్లో వచ్చిన ‘100% లవ్’, ‘తడాఖా’ చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. పైగా ఈ జోడికి మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ జోడితో ఎలాగైనా మరోసారి హిట్టు కొట్టాలని దర్శకుడు చందు మొండేటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more