లోకనాయకుడు కమల్ కూతురు శృతిహాసన్ జీవితంలో గతకొన్నాళ్ల నుంచి బ్యాడ్ డేస్ చుట్టుముట్టాయి. అంతా సాఫీగా జరుగుతున్న ఈమె కెరీర్ లో అనుకోకుండా రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి సినిమా ఒప్పందంలో వచ్చిన వివాదం కాగా.. మరొకటి విమానంలో ఎవరో మినిష్టర్ తిట్టారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ రెండింటిలో విమానం గొడవ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ.. మూవీ ఒప్పందంలో వచ్చిన వివాదం మాత్రం అగ్గిరాజుకుంది. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ వ్యవహారం కోర్టు దాకా కూడా వెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నాగార్జున–కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలోనటించేందుకు శృతిహాసన్ ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంత పార్ట్ కూడా నటించింది. అయితే.. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్న ఈ అమ్మడు.. ఆ మల్టీస్టారర్ సినిమాకోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో చేసేదేమీలేక ఆమె ఆ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ మూవీ ప్రొడ్యూసర్ పివిపి వారి పిక్చర్ హౌస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. సివిల్ రూల్స్ ప్రకారం శృతి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయగా.. ఆమె కూడా ఆ కేసుకు వ్యతిరేకంగా వాదన వినిపించింది. ఇలా ఈ రెండు వర్గాల మధ్య గత కొద్ది రోజులుగా కోర్టులో కొన్ని వాదనలు జరుగుతూ వచ్చాయి.
చివరగా.. ఈ విషయంలో శృతి హాసన్ కి పూర్తి రిలీఫ్ దొరికింది. తమిళ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఇద్దరూ కలిసి ఈ విషయాన్ని డీల్ చేసారు. వీరి రిక్వెస్ట్ మేరకు ది పిక్చర్స్ హౌస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు కేసుని విత్ డ్రా చేసారు. ఇరు ఫిల్మ్ కౌన్సిల్స్ మీద ఉన్న గౌరవం, రానున్న కాలంలో ఇండస్ట్రీలో కలిసి మెలగాలన్న ఉద్దేశంతో వారు శృతి హాసన్ పై ఉన్న కేసును వెనక్కి తీసుకున్నారు. అయితే.. ప్రొడక్షన్ హౌస్ మాత్రం యాక్టర్స్ ఒకసారి సినిమాకి సైన్ చేసాకా అగ్రిమెంట్స్ కి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఏదైతేనేం.. చివరికి ఈ కేసు నుంచి శృతికి పెద్ద రిలీఫ్ దొరికింది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more