clashes between atrists of tollywood during maa elections wind up peacefully.?

Clashes between atrists of tollywood during maa elections wind up peacefully

maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

clashes between atrists of tollywood during movie artists association elections wind up peacefully.?

సినీ కళామతల్లి కుటుంబంలో కలహాలు కాపురం ముగిసేనా..?

Posted: 03/29/2015 03:03 PM IST
Clashes between atrists of tollywood during maa elections wind up peacefully

తెలుగు సినీ కళామా తల్లి కుటుంబంలో కలహాలు కాపురం పెడుతున్నాయి. మూవీ అర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రముఖ నటుల మధ్య పోటీ.. వారి ప్యానెల్ తరపున ఫోటీ చే్స్తున్న దిగువ శ్రేణి నటీనటుల మధ్య పోరపచ్చాలను తీసుకువచ్చింది. ఎన్నికల వరకు తమకు ప్యానెళ్లు.. వర్గాలు.. ఆ తరువాత అందరం ఒక్కటే.. అని అందరూ చెబుతున్నా.. ఈ దఫా ఎన్నికల సందర్భంగా రాజుకున్న అగ్గి.. అంత త్వరగా చల్లారది తెలుస్తుంది. ఇందుకు నటి హేమ చేస్తున్న వ్యాఖ్యలే కారణమవుతున్నాయి.

నటి హేమ తనపై చేసిన వ్యాఖ్యలు తన విజ్ఞతకే వదిలేస్తున్నానని నటుడు శివాజీ రాజా అన్నారు. ఆమె కంట్రోల్లో ఉంటే బావుంటుందని చెప్పారు. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం హేమకు ఏముందని ప్రశ్నించారు.  వీలుంటే మంచి చేయాలని హితవు పలికారు. వారు ఓడిపోతారనే భయంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హేమ మీపై ఎన్నికల అనంతరం చర్యలు తీసుకుంటారని అంటున్నారుగా అని ప్రశ్నించగా వారు ఏ చర్యలైనా తీసుకోవచ్చని, తాను తాటాకు చప్పుళ్లకు భయపడనని అన్నారు.

అయితే నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యుడు, నటుడు శివాజీ రాజా తనను వ్యక్తిగతంగా దూషించారని సినీ నటి హేమ ఆరోపించారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని దర్శకరత్న దాసరి నారాయణరావుని కలిశానని ఆమె తెలిపారు. తనకు క్షమాపణ చెప్పేంత సంస్కారం శివాజీరాజాకు ఉందని అనుకోవటం లేదని ఘాటుగా విమర్శలు చేశారు. తనపై వ్యక్తిగతంగా దూషణలు చేసినందుకే శివాజీ రాజాపై ఫైర్ అవ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్లిన సంగతి నిజమేనని హేమ చెప్పారు. దీంతో ఎన్నికలు ముగిసినా.. ఈ కలహాలు కొనసాగుతూనే వుంటాయని అనుమానాలు కలుగుతున్నాయి.

పెద్దలంతా ఇంతేనా..?

మా ఎన్నికల సందర్భంగా నటుడు శివాజీరాజా.. హేమ పరస్పరం విరుద్ధంగా చేసుకున్న వ్యాఖ్యలపై స్పందించిన.. మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటి జయసుధ అది వారి వ్యక్తిగత విషయంగా పేర్కోన్నారు. సాధారణ ఎన్నికలు తలపించే తీరులో ఆదివారం మూవీ ఆర్ట్స్ అసోసియేషన్కు ఎన్నికలు ముగిసాయి.  ఈ ఎన్నికలు తెలుగు చిత్ర సీమలోని నటులు మధ్య ఉన్న వైరుధ్యాలను ఒక్కసారిగా బయట పడేశాయి. ఈ సందర్భంగా శివాజీరాజా, హేమ వ్యాఖ్యలపై జయసుధను ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు.  ఈ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే తమ ప్రత్యర్థులు కోర్టుకు వెళ్లారని, ఎవరు ఎన్నిసార్లు మీడియా సమావేశాలు పెట్టారో ఇప్పటికే మీకు తెలుసని అన్నారు. మరిన్ని ప్రశ్నలు అడుగుతుండగా సమాధానం దాటవేసి వెళ్లారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  jayasudha  maa president elections  maa  movie arts association  shivaji raja  hema  

Other Articles