మా ఎన్నికలు రసభసగా మారాయి. అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారని అనుకుంటే... పోటీ ఏర్పడి... ఆ పోటి ప్రస్తుతం రెండు గ్రూపులు, వ్యక్తిగత విషయాల్లో గొడవలు పెంచే విధంగా మారాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
రాజేంద్రప్రసాద్ కు మద్ధతు పలుకుతూ నటుడు నాగబాబు, శివాజీరాజా తదితరులు ఓ ప్రెస్ మీట్ పెట్టి పలు వ్యాఖ్యలు చేసారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ చేసిన కామెంట్లకు కౌంటర్ గా నిన్న జయసుధ ప్యానెల్ సభ్యులు విరుచుకుపడ్డారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులపై భారీగా కామెంట్లు చేసారు.
తనను ఈ పోటీలో పాల్గొనవద్దని పలువురితో చెప్పించడం కూడా జరిగిందని జయసుధ మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. అలాగే నటి హేమ కూడా పలు వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడినవే అని తెలిసిందే.
అయితే జయసుధ ప్యానెల్ వారు రాజేంద్రప్రసాద్ మరియు నాగబాబులపై చేసిన కామెంట్లకు తాజాగా రాజేంద్రప్రసాద్ ప్యానెల్ సభ్యులు స్పందించారు. ఈ విషయంపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...‘మా’లో మార్పు కోసం, సేవ చేయడానికే తాను ఈ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకున్నాను. అందుకే వచ్చాను. ఈ విషయంపై సినీ పెద్దలను కలిసాను. వారు సానుకూలంగా స్పందించారు.
తనతో పోటీ చేయగల స్థాయి ఈ తెలుగు సినీపరిశ్రమలో ఎవడికి లేదు. ఈ ‘మా’ ఎన్నికలు ధర్మయుద్ధం లాంటిది. మంచి చేయడానికి నేను పోటీలో దిగడమే పాపం అయితే... ఆ పాపాన్ని నేను మూటగట్టుకుంటాను. జయసుధని ఢిల్లీ నుంచి ఓ మహాశక్తి నడిపిస్తోంది. ఆ శక్తి ఢిల్లీ నుంచే చక్రం తిప్పుతానంటోందని ఆయన చెప్పుకొచ్చారు.
అలాగే... ఇక్కడ పురుషాదిక్యత అనే ఆరోపణలు చేసారు.. అసలు పురుషాదిక్యత ఏంటి? అలా పురుషాదిక్యత చేసి వుంటే సావిత్రి గారి నుంచి మీలాంటి సహజనటి వరకు అందరిని ఆదరించారు కదా! రాజకీయాలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ని కంపు చేశారు. సినిమాల్లో పనిలేకే ఇక్కడ కుట్రలు చేస్తున్నారు అని అన్నారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన వారిని కళాకారులు అని అనరు.. శాడిస్టులు అని అంటారు అని చెప్పుకొచ్చారు.
మా సభ్యులకు తాను సెల్ ఫోన్లు పంచిపెడుతున్నారని జయసుధ ప్యానెల్ సభ్యులు ఆరోపణలు చేసారు. మా సభ్యులకు సెల్ ఫోన్లు పంచిపెడితే అవి తీసుకుని ఓట్లు వేసేంత నీచస్థాయిలో సినిమా కళాకారులు వున్నారా అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. పదిమందిని నవ్వించి ఇంతదూరం వచ్చినవాడిని ఇప్పుడిలా చీప్ ట్రిక్స్కి పాల్పడి ఓట్లు దండుకోవాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more