యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రభస’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో బెల్లంకొండ గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీతలు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయనున్నారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్ లు కలిసి విడుదల చేసారు. అయితే ఈ కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కన్నీటి పర్యాంతమయ్యాడు.
ఈ సంధర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు జాండిస్ వచ్చాయి. అయినా కూడా సినిమా గురించి ఆలోచించకుండా... నీకేం కాదు. నువ్వు ముందు కోలుకో.. నీకు నేను అండగా నేనున్నానంటూ ఎన్టీఆర్ నాకు ధైర్యం చెప్పారు’ అంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు. అలాగే తన అనారోగ్యం కారణంగా దాదాపు మూడు నాలుగు నెలలు షూటింగ్ ఆలస్యమయ్యినా కూడా ఒక్క మాట కూడా అనకుండా తనకు అండగా నిలిచారు నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు. వీరిద్దరికి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది’ అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు సంతోష్ శ్రీనివాస్. దీంతో పక్కనే వున్న ఎన్టీఆర్ ఓదార్చాడం జరిగింది.
ఇటీవలే ఎన్టీఆర్ తండ్రయ్యిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.... నా సినీ జీవితం కళ్ల ముందు తిరుగుతోంది. 17 ఏళ్ల వయసులో పరిశ్రమలోకి వచ్చాను. ఒక తల్లిదండ్రికి బిడ్డగా వచ్చాను. ఇప్పుడో తండ్రి స్థాయిలో ఇక్కడ నిల్చున్నాను. ఈ ప్రయాణంలో అండదండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నా దైవం అయిన మా తాతగారు నందమూరి తారకరామారావు ఆశీస్సులు, మీ అభిమానం నాపై ఎప్పుడూ వుంటాయి. అలాగే నా బిడ్డపైనా కూడా మీ అశీస్సులు వున్నాయి కాబట్టే.. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక ‘రభస’ విషయానికొస్తే... పది నెలల కష్టమిది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు జాండిస్ రావడం జరిగింది. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది కాబట్టి... అతనికి ఏం కాకుండా త్వరగా కోలుకొని, ఆరోగ్యంగా ఇపుడు మీ ముందున్నాడు. చాలా కష్టపడ్డాడు. అతని కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఆది తర్వాత బెల్లంకొండ సురేష్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ప్రతిసారి చెబుతుంటాను.. ఈసారి కూడా అదే చెబుతున్నాను... జాగ్రత్తగా ఇంటికెళ్లండి. మీ తల్లితండ్రులు మీకోసం ఎదురుచూస్తుంటారు. క్షేమంగా వెళ్లండి అని మాట్లాడారు. చివరగా.. ఈ సినిమాలో తాను పాడిన ‘రాకాసి రాకాసి...’ అనే పాటలోని రెండు లైన్లను పాడి, అభిమానులను అలరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more