చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ షియోమీ తన కొత్త ఉత్పత్తులు, సరికొత్త మోడళ్లతో ఎలక్ట్రానిక్స్ రంగంలో రారాజుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సామ్ సంగ్ సంస్థను మొబైల్ స్మార్ట్ ఫోన్ల రంగంలో వెనక్కు నెట్టి భారత మార్కెట్ లో గుత్తాధిపత్యాన్ని చాటుకుంటుంది. ఇక ఈ సంస్థ ఇటు టీవీ రంగంలోనూ తన సత్తాను చాటుకుంటూ ముందుకు సాగుతన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 55 అంగుళాలు, 32 రెండు అంగుళాల టీవీలను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన షియోమి.. తాజాగా మరో కొత్త మోడల్ టీవీని కూడా త్వరలో ప్రవేశపెట్టనుంది.
‘ఎంఐ’ బ్రాండ్ కింద ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీని చైనాలో ఆవిష్కరించింది. దీని ధరను 1,699 యువాన్లుగా ఖరారు చేసింది. మన కరెన్సీలో చూస్తే రూ.17,800. ఎంఐ 4ఏ మోడల్ ను షియోమీ భారత్ లో మార్చిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులోనే 4ఏ యూత్ ప్రత్యేక వెర్షన్. ప్రస్తుతం మన దేశంలో ఎంఐ 4 స్మార్ట్ 4కే టీవీ 55 అంగుళాల మోడల్ ను రూ.44,999కు, 4ఏ 32 అంగుళాల టీవీ రూ.13,999కు, 4ఏ 43 అంగుళాల టీవీని రూ.22,999కు విక్రయిస్తోంది. త్వరలో 4ఏ యూత్ ను ఇక్కడ విడుదల చేసే అవకాశం ఉంది.
4ఏ యూత్ టీవీ 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో ఉంటుంది. రీఫ్రెష్ రేటు 60 గిగాహెర్జ్, 178 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూసే వీలు, 1.5 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ అమ్లోజిక్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్నాయి. వైఫై, రెండు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులు, ఈథర్ నెట్ పోర్ట్, ఏవీ కాంపోనెంట్ పోర్ట్ ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more